amp pages | Sakshi

మామయ్య చెప్పిన ఆ మాట మనసులో నాటుకుపోయింది: వైఎస్‌ భారతి

Published on Sat, 05/07/2022 - 19:33

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని తన నివాసంలో గోశాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పల్లె వాతావరణం ఉట్టిపడేలా వినూత్న ఆకృతిలో ఈ గోశాలను నిర్మించారు. తాజాగా సీఎం జగన్‌ సతీమణి భారతిని ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ శిల్పారెడ్డి.. గోశాలలో ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా గోశాల నిర్మాణం.. అదే విధంగా ఆమె వ్యక్తిగత విషయాల గురించి శిల్ప అడిగి తెలుసుకున్నారు.

గోశాల నిర్మాణం చాలా అద్భుతంగా ఉందని, తన చూపును తిప్పుకోలేకపోతున్నానని శిల్పారెడ్డి అన్నారు. నిర్మాణమంతా చాలా సంప్రదాయబద్దంగా కనిపిస్తోందని, ఇందుకు ఎలాంటి శ్రద్ధ తీసుకున్నారని అడిగారు. ఇందుకు భారతి స్పందిస్తూ.. ‘గోశాలను ఏ విధంగా నిర్మించాలనే విషయంలో ఎక్కువ వివరాలు ఇవ్వలేదు. అయితే నిర్మాణంలో ఎక్కువగా కృత్రిమ మెటీరియల్‌ను వాడొద్దని, వీలైనంత వరకు ప్రకృతికి దగ్గరగా ఉండే వస్తువులను ఉపయోగించాలని’ మాత్రమే సూచించినట్లు తెలిపారు.

ఇంటి ఆవరణలో మొక్కలు పెంచడం గురించి మాట్లాడుతూ.. ‘బొప్పాయి మొక్కను మొదట కుండీలో పెంచి ఆ తర్వాత పెరట్లో నాటాము. అలాగే మొక్కజొన్నను కూడా కుండీలలో పెంచాము. ఇంకా ఇంట్లో వండుకునేందుకు వీలుగా పాలకూర, మెంతి కూర కూడా పెంచాము. మనం ఎలాంటి ఆహారం తీసుకుంటున్నామనేది తెలిస్తే ఇంకా బాగుంటుంది కదా అని పేర్కొన్నారు. ఇంట్లోనే కొన్ని కూరగాయలు, ఆకు కూరలు పెంచుకోవడం, బయట ఫుడ్‌ తగ్గించి స్వయంగా వండుకొని తినడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోగలమ’ని అన్నారు.

‘నా చిన్నతనంలో మా అమ్మ ఏం చేసేదంటే రాత్రి మిగిలిన అన్నంలో పెరుగు, పాలు వేసి కలిపి పెట్టేది. పొద్దునకల్లా అది పెరుగన్నంగా మారేది. నాకు తెలిసి అమ్మ ఇప్పటికీ అదే చేస్తుంది. మా మామయ్య (దివంగత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి) చెట్లను పెంచేవారు. చాలామంది అది చూసి ఏదైనా పంట వేయకుండా ఇలా ఎందుకు చెట్లను పెంచుతున్నారని అడిగేవారు. ఆయన ఒక్కటే చెప్పేవారు.. ఇది భవిష్యత్తు కోసం నేను పెడుతున్న పెట్టుబడి అనేవాళ్లు. ఆ మాట నా మనసులో నాటుకుపోయింది’ అని వైఎస్‌ భారతి చెప్పుకొచ్చారు. మరిన్ని వివరాల కోసం కింది ఇంటర్వ్యూని చూడండి.

Videos

Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన పాలన ఉంది

వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం..హారతులతో స్వాగతం పలికిన మహిళలు

మాటలు చెప్పే ప్రభుత్వం కాదు...చేసి చూపించే ప్రభుత్వం..

కూటమి మేనిఫెస్టో పై ఉష శ్రీ చరణ్ సంచలన వ్యాఖ్యలు..

కూటమి మేనిఫెస్టో పై కొమ్మినేని కామెంట్స్

టీడీపీ మేనిఫెస్టో పై పేర్నినాని పంచులు

ఢిల్లీలో కలకలం.. 50 స్కూళ్లకు బాంబు బెదిరింపులు

జనసంద్రమైన బొబ్బిలి

ఇది అబద్దాల మేనిఫెస్టో..లెక్కలేసి భయపడుతున్న చంద్రబాబు..

Watch Live: బొబ్బిలిలో సీఎం జగన్ ప్రచార సభ

పవన్ కళ్యాణ్ కు ముద్రగడ సవాల్

సీఎం జగన్ ను చంపేందుకు కుట్ర..!

శ్రీశైలం టీడీపీ అభ్యర్థి బండ బూతులు..

గుండె నిండా కేసీఆర్..

అట్టర్ ఫ్లాప్..

జనసేన పరువు తీసిన చింతమనేని

పవన్ కళ్యాణ్, చిరంజీవి కుట్ర బయటపెట్టిన కేఏ పాల్

వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారం

YSRCP ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడిపై దాడికి యత్నం

Photos

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)