ఈనెల 24 నుంచి స్థానికులకు టీటీడీ టిక్కెట్లు

Published on Thu, 12/17/2020 - 19:14

సాక్షి, తిరుపతి/చిత్తూరు : ఈ నెల 25 నుంచి వైకుంఠ ఏకాదశి దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఈవో జవహర్‌ రెడ్డి తెలిపారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ... ‘24వ తేదీ నుంచి స్థానికులకు టిక్కెట్లు కేటాయిస్తాం. రోజుకు ఏడువేల టిక్కెట్లు స్థానికులకు కేటాయింపు ఉంటుంది. అయితే స్వామివారి కల్యాణం టిక్కెట్లు ఉన్నవారికి డిసెంబర్‌  25, 26, జనవరి 1న దర్శనం ఉండదు. ఆ మూడురోజులు సిఫార్సు లేఖలు రద్దు చేశాం.

అదే విధంగా గోవింద మాల భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా ఉండవు. 25వ తేదీ తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి వైకుంఠ ఏకాదశి దర్శనాలు ప్రారంభం అవుతాయి. సామాన్య భక్తులకు ఎనిమిది గంటల నుంచి  వైకుంఠ ఏకాదశి దర్శనం ప్రారంభం అవుతుంది’ అని తెలిపారు. కాగా శ్రీవారి దర్శనంలో తమకూ ప్రత్యేక కోటా కల్పించాలని మూడు దశాబ్దాలుగా స్థానికులు(చిత్తూరు జిల్లా) విజ్ఞప్తిని టీటీడీ ఆమోదించిన విషయం తెలిసిందే.(చదవండి: తిరుమల అంజనాద్రే ఆంజనేయుని జన్మస్థలం)

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ