జేఈఈ మెయిన్స్లో సత్తాచాటిన గిరిజన బాలికలు
Anand Mahindra: యుద్ధంలో చివరికి తేలే ఫలితం ఇదే
Published on Fri, 03/11/2022 - 14:10
ఉక్రెయిన్పై రష్యా చేపట్టిన దండయాత్ర తర్వాత... ప్రపంచ దేశాలు ముఖ్యంగా పశ్చిమం రష్యా వైఖరిని తప్పుపడుతున్నాయి. అమెరికా ఎత్తుగడలు ఉక్రెయిన్ మొండితనం వల్లే దాడి చేయాల్సి వచ్చిందనే అభిప్రాయం రష్యా మద్దతుదారులు అంటున్నారు. తప్పొప్పుల సంగతి పక్కన పెడితే అసలు యుద్ధంలో చివరి ఏం సాధిస్తారనే అంశం ఇప్పుడు చర్చకు వస్తోంది.
ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఇప్పటికే మూడో వారంలోకి ప్రవేశించింది. ఇరు వైపుల భారీ ఆస్తి నష్టం సంభవించింది. తుపాకి తూటాలకు వేల సంఖ్యలో సైనికులు నేలకొరుగుతున్నారు. ఈ తరుణంలో యుద్ధంతో సాధించేది ఏమిటంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. యుద్ధంలో ఎవరిది రైట్ అనేది ఎప్పటికీ తేలని అంశమని.. యుద్ధంలో ఎవరిని కోల్పోయామన్నదే చివరికి తేలే సత్యమన్నారు ఆనంద్ మహీంద్రా.
The most powerful illustration I have seen of this well- known quote…. And the most apt today. pic.twitter.com/nXe7FuSdrj
— anand mahindra (@anandmahindra) March 11, 2022
Tags