యాపిల్‌ సంచలన నిర్ణయం.. వాటిని పూర్తిగా నిలిపివేసేందుకు సిద్ధం..!

Published on Tue, 04/19/2022 - 11:26

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం యాపిల్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది చివర్లో ఐఫోన్‌-14 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లను యాపిల్‌ లాంచ్‌ చేయనుంది. ఈ నేపథ్యంలో 2019 సెప్టెంబర్‌లో విడుదలైన ఐఫోన్‌ 11 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్ల పూర్తిగా నిలిపివేయనున్నట్లు యాపిల్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది. 

iDropNews నివేదిక ప్రకారం...ఐఫోన్‌-11 స్మార్ట్‌ఫోన్‌ ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన ఐఫోన్‌ ఎస్‌ఈ 3తో నేరుగా పోటీపడటంతో...ఈ సంవత్సరం నుంచి దశలవారీగా ఐఫోన్‌ 11 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లను నిలిపివేసేందుకు యాపిల్‌ సిద్దమైన్నట్లు తెలుస్తోంది. భారత్‌లో ఐఫోన్‌-11, ఐఫోన్‌ ఎస్‌ఈ 3 స్మార్ట్‌ఫోన్ల ధరలు కూడా సరిసమానంగా  ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఐఫోన్‌-11 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లను నిలిపివేసేందుకు యాపిల్‌ సన్నాహాలను చేస్తోంది. ఇదిలా ఉండగా ఐఫోన్‌-12 ధరలు కూడా తగ్గే అవకాశం ఉన్నట్లు సమాచారం. భవిష్యత్తులో ఐఫోన్‌-12 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌ ధరలు ఐఫోన్‌-11 ధరలతో సమానంగా ఉండే ఆస్కారం ఉందని ఐడ్రాప్‌ న్యూస్‌ తన నివేదికలో పేర్కొంది. 

చదవండి: యాపిల్ ఉత్పత్తులపై భారీ తగ్గింపు.. లేటెస్ట్ ఐఫోన్ మోడల్స్ తక్కువ ధరలోనే...

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ