amp pages | Sakshi

ప్రపంచంలోనే చౌకైన ఎలక్ట్రిక్‌ బైక్.. ధర రూ.40 వేలు మాత్రమే

Published on Sun, 09/26/2021 - 21:32

రోజు రోజుకి ఎలక్ట్రిక్ మార్కెట్లో పోటీ విపరీతంగా పెరిగి పోతుంది. వారానికి ఒక కొత్త ఎలక్ట్రిక్ వాహనం విడుదల అవుతుంది. మరో భారతీయ ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీ డెటెల్ "ఈజీ ప్లస్ ఎలక్ట్రిక్ బైక్"ను లాంచ్ చేసింది. ఈజీ ప్లస్ ఎలక్ట్రిక్ బైక్‌ ధర రూ.41,999 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈజీ ప్లస్‌ను రూ.1,999 చెల్లించి అధికారిక వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. డిటెల్ ఈజీ ప్లస్ 20ఆంపియర్, 250వాట్ లిథియం-అయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఇది 100 శాతం ఛార్జ్ కావడానికి 4నుంచి 5 గంటలు పడుతుంది. సింగిల్ ఛార్జ్ ద్వారా ఈజీ ప్లస్ ఎలక్ట్రిక్ బైక్ తో 60 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు అని డిటెల్ పేర్కొంది. 

ఈ ఎలక్ట్రిక్ బైక్ టాప్ స్పీడ్ 25 కి.మీ. డిటెల్ ఈజీ ప్లస్ ఎలక్ట్రిక్ బైక్‌లో పౌడర్-కోటెడ్, మెటల్ అల్లాయ్ బాడీ ఉంది. దీనిని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని కంపెనీ పేర్కొంది.  ఇది డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ పానెల్, ట్యూబ్ లెస్ టైర్లు, డ్రమ్ బ్రేక్స్, పెడల్స్ వంటి లక్షణాలతో వస్తుంది. ఈజీ ప్లస్ 170 కిలోల వరకు బరువును మోయగలదు. 40,000 కిలోమీటర్ల వరకు చెల్లుబాటు అయ్యే ఈ స్కూటర్‌పై కంపెనీకి 2 సంవత్సరాల స్టాండర్డ్ వారంటీ లభిస్తుంది. ఈ స్కూటర్ ప్రీపెయిడ్ రోడ్‌సైడ్ ప్యాకేజీతో పాటు ఉచిత హెల్మెట్‌ను కూడా అందిస్తున్నారు. కలర్ ఆప్షన్స్ విషయానికొస్తే.. వినియోగదారులు మెటాలిక్ ఎల్లో, మెటాలిక్ రెడ్, మెటాలిక్ బ్లాక్, గన్మెటల్, పెర్ల్ వైట్ రంగులను ఎంచుకోవచ్చు. ఇది 170 మీ.మీ గ్రౌండ్ క్లియరెన్స్ ను కూడా కలిగి ఉంది.(చదవండి: క్వాడ్ కెమెరా సెటప్‌తో వివో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌...!)

Videos

Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన పాలన ఉంది

వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం..హారతులతో స్వాగతం పలికిన మహిళలు

మాటలు చెప్పే ప్రభుత్వం కాదు...చేసి చూపించే ప్రభుత్వం..

కూటమి మేనిఫెస్టో పై ఉష శ్రీ చరణ్ సంచలన వ్యాఖ్యలు..

కూటమి మేనిఫెస్టో పై కొమ్మినేని కామెంట్స్

టీడీపీ మేనిఫెస్టో పై పేర్నినాని పంచులు

ఢిల్లీలో కలకలం.. 50 స్కూళ్లకు బాంబు బెదిరింపులు

జనసంద్రమైన బొబ్బిలి

ఇది అబద్దాల మేనిఫెస్టో..లెక్కలేసి భయపడుతున్న చంద్రబాబు..

Watch Live: బొబ్బిలిలో సీఎం జగన్ ప్రచార సభ

పవన్ కళ్యాణ్ కు ముద్రగడ సవాల్

సీఎం జగన్ ను చంపేందుకు కుట్ర..!

శ్రీశైలం టీడీపీ అభ్యర్థి బండ బూతులు..

గుండె నిండా కేసీఆర్..

అట్టర్ ఫ్లాప్..

జనసేన పరువు తీసిన చింతమనేని

పవన్ కళ్యాణ్, చిరంజీవి కుట్ర బయటపెట్టిన కేఏ పాల్

వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారం

YSRCP ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడిపై దాడికి యత్నం

Photos

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్