Gold Price: భారీగా పెరిగిన బంగారం ధర

Published on Tue, 05/18/2021 - 19:48

న్యూఢిల్లీ: కొద్దీ రోజుల పాటు తగ్గిన బంగారం ధర మళ్లీ రెండు రోజుల నుంచి పెరుగుతూ వస్తుంది. బంగారం ధర విషయంలో నిపుణులు కూడా ఎప్పుడు పెరగుతుందో, తగ్గుతుందో అంచనా వేయలేకపోతున్నారు. దేశరాజధాని న్యూఢిల్లీలో 24 క్యారెట్ల 10గ్రాములు బంగారం ధర నేడు రూ.300 పెరగడంతో రూ.48,480కు చేరుకుంది. అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్‌ ఏర్పడటంతోనే ధర పెరిగినట్లు బులియన్‌ ట్రేడింగ్‌ వర్గాలు తెలిపాయి. ఇక వెండి ధర అయితే భారీగా పెరిగింది. నేడు రూ.1433 పెరగడంతో కిలో రూ.73,168 చేరింది.

ఇక హైదరాబాద్ మార్కెట్లో నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.300 పెరిగి రూ.45,450 వద్ద నిలిచింది. అలాగే, పెట్టుబడులు పెట్టేందుకు వాడే 24 క్యారెట్ల 10 గ్రాములు ప్యూర్ గోల్డ్ ధర మాత్రం రూ.330  పెరిగి రూ.49,590కు చేరుకుంది. హైదరాబాద్, విజయవాడలో బంగారం ధరలు ఒకేలా ఉన్నాయి. బంగారం ధరతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 1,869 డాలర్లు కాగా, వెండి ఔన్సు 28.48డాలర్లుగా నమోదైంది.

చదవండి:

ఈ పోటీలో గెలిస్తే రూ.50 వేలు మీ సొంతం?

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ