ట్రిపుల్‌ ఏఐ రియర్‌కెమెరాతో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌, అదీ బడ్జెట్‌ ధరలో

Published on Tue, 09/20/2022 - 16:09

సాక్షి,ముంబై: భారతీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది.  50మెగాపిక్సెల్ AI ట్రిపుల్ కెమెరా, 6X జూమ్ పెరిస్కోప్-స్టైల్‌తో లావా బ్లేజ్‌ ప్రొ అనే కొత్త బడ్జెట్ ఫోన్‌ను మంగళవారం విడుదల చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన లావా బ్లేజ్‌కు ఈ స్మార్ట్‌ఫోన్ సక్సెసర్. సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, బాటమ్-ఫైరింగ్ స్పీకర్, ప్రీమియం ఫ్రోస్టెడ్ గ్లాస్ డిజైన్, ఫేస్ అన్‌లాక్ సపోర్ట్, టైప్‌సీ చార్జర్‌లాంటి ఇతర ఫీచర్లను ఇందులో అందించడం విశేషం.

లావా బ్లేజ్‌ ప్రొ స్పెసిఫికేషన్స్
6.5అంగుళాల HD డిస్‌ప్లే
ఆండ్రాయిడ్‌ 12,  MediaTek G37 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌
4జీబీర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌
8మెగాపిక్సెల్  సెల్ఫీ  కెమెరాతో
5000mAh  బ్యాటరీ కెపాసిటీ

ధర, లభ్యత
లావా బ్లేజ్ ప్రో రూ. 10,499లుగా కంపెనీ ధర నిర్ణయించింది. గ్లాస్ గ్రీన్, గ్లాస్ ఆరెంజ్, గ్లాస్ బ్లూ ,  గ్లాస్ గోల్డ్  అనే  నాలుగు విభిన్న రంగుల్లో ఈ ఫోన్‌ లభ్యం. ఫ్లిప్‌కార్ట్, లావా ఇ-స్టోర్ దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్ స్టోర్‌లలో అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ