ఈ కార్లకు జనాల్లో ఫుల్ క్రేజ్..కానీ ఇప్పుడు షెడ్డుకు చేరిన వేల కార్లు!

Published on Wed, 12/07/2022 - 08:16

న్యూఢిల్లీ: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ 9,125 కార్లను రీకాల్‌ చేస్తోంది. మార్కెట్‌లో విపరీతంగా అమ్ముడు పోతున్న  సియాజ్, బ్రెజ్జా, ఎర్టిగా, ఎక్స్‌ఎల్‌6, గ్రాండ్‌ వితారా కార్లలో ముందు వరుస సీట్ల బెల్ట్‌లలో ఉన్న లోపాలను సరిదిద్దడానికి ఈ నిర్ణయం తీసుకుంది. ఇవి 2022 నవంబర్‌ 2–28 తేదీల్లో తయారైనవని కంపెనీ తెలిపింది. 

షోల్డర్‌ హైట్‌ అడ్జెస్టర్‌ ఉప భాగాలలో ఒకదానిలో లోపం ఉందని అనుమానిస్తున్నామని, ఇది అరుదైన సందర్భంలో సీట్‌ బెల్ట్‌ విడదీయడానికి దారితీయవచ్చని మారుతీ సుజుకీ వెల్లడించింది.

వాహనాలను తనిఖీ చేసి, లోపం ఉన్న భాగాన్ని భర్తీ చేయడం కోసం ఉచితంగా రీకాల్‌ చేయాలని నిర్ణయించినట్లు కంపెనీ వివరించింది. అధీకృత వర్క్‌షాప్‌ల నుండి సంబంధిత కార్ల యజమానులకు సమాచారం వెళుతుందని తెలిపింది.    

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ