ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లో కట్టేసి చిత్రహింసలు

Published on Sun, 02/28/2021 - 15:45

సాక్షి, మేడ్చల్‌ : మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ వ్యక్తిని మాట్లాడదామని పిలిచి చిత్రహింసలు పెట్టారు ముగ్గురు వ్యక్తులు. ఈ సంఘటన మేడ్చల్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. మేడ్చల్ జిల్లా చర్లపల్లి ఈసీ నగర్‌కు చెందిన లింగాస్వామి అనే వ్యక్తి ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.  కుషాయిగూడ పోలీసులు బాధితురాలి ఫిర్యాదు మేరకు లింగాస్వామిని అదుపులోకి తీసుకుని విచారించారు. మరుసటి రోజు రమ్మని చెప్పి పంపేశారు. ఈ నేపథ్యంలో ముగ్గురు వ్యక్తులు లింగాస్వామిని మాట్లాడదామని కారులో తీసుకెళ్లారు.

చర్లపల్లి ఈసీ నగర్‌లోని ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో లింగా స్వామి నోట్లో గుడ్డలు కుక్కి, కట్టేసి చితకబాదారు. ఆ రాత్రి మొత్తం కారులో తిప్పి  బాగా కొట్టి వదిలేశారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో వెలుగులోకి రావటంతో బాధితుని తమ్ముడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ముగ్గురు వ్యక్తుల్ని అరెస్ట్‌ చేసిన పోలీసులు విచారిస్తున్నారు.

చదవండి : నిందితుడి ఆత్మహత్య.. ఎస్‌ఐ సస్పెన్షన్‌

భార్య ఫిర్యాదు, ఆందోళనతో భర్త ఆత్మహత్యాయత్నం

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ