మాజీ కౌన్సిలర్‌ దారుణ హత్య

Published on Thu, 01/28/2021 - 08:44

సాక్షి, జనగామ : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ మాజీ కౌన్సిలర్‌ను అతి కిరాతకంగా గొడ్డలితో నరికి చంపారు గుర్తు తెలియని ఇద్దరు దుండగులు. ఈ సంఘటన గురువారం తెల్లవారుజామున జరిగింది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు మేరకు.. మాజీ కౌన్సిలర్‌ పులిస్వామి గురువారం తెల్లవారుజామున జాగింగ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బైకుపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆయన్ని అడ్డగించారు. అనంతరం గొడ్డలితో దాడి చేశారు. ( అదృశ్యమైన నాగరాజు దారుణహత్య )

తీవ్రగాయాలపాలైన పులిస్వామి అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. ఆ వెంటనే హంతకులు అక్కడినుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స‍్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. భూవివాదం నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ