దారుణం.. తలపై సుత్తితో మోది..

Published on Thu, 08/13/2020 - 06:33

పెందుర్తి: తండ్రి చేతిలో తనయుడు దారుణ హత్యకు గురయ్యాడు. తలపై సుత్తితో మోది ఈ దారుణానికి ఒడిగట్టాడు. పోలీసులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి..  సీమేన్‌గా పనిచేసి పదవీ విరమణ చేసిన గొరుపాటి వీర్రాజు అనే వ్యక్తి  పెందుర్తి సమీపంలోని చినముషిడివాడ సత్యానగర్‌లో  కుమారుడు జలరాజు (41)తో కలిసి నివాసం ఉంటున్నాడు. జలరాజు కూడా  సీమెన్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల డ్యూటీ నుంచి వచ్చి ఇంట్లోనే ఉంటున్నాడు.

అతను బుధవారం ఉదయం ఇంటి పెరట్లో జలరాజు పనిచేస్తుండగా తండ్రి  వచ్చి పక్కనే ఉన్న సుత్తితో కుమారుడి తలపై గట్టిగా కొట్టడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఆటోలో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే ప్రాణాలు విడిచాడు. నిందితుడు  పెందుర్తి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. కాగా వీర్రాజుకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుటుంబంలో ఆస్తికి సంబంధించి వివాదాలు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. జలరాజు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. ఇన్‌చార్జి సీఐ మళ్ల అప్పారావు, ఎస్‌ఐలు శ్రీను, హరి ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ