వారం రోజుల్లో పెళ్లి.. అంతలోనే యువతి ఇలా!

Published on Fri, 04/08/2022 - 14:45

సాక్షి, చాంద్రాయణగుట్ట: వారం రోజుల్లో పెళ్లి చేసుకోవాల్సిన యువతి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌.దేవేందర్‌ వివరాల ప్రకారం.. శంషీర్‌గంజ్‌లోని వెంకటేశ్వర కాలనీకి చెందిన హన్మంత్‌చారి కుమార్తె సాహితి(27) వివాహాన్ని ఈసీఐఎల్‌కు చెందిన యువకుడితో ఈ నెల 14వ తేదీన వివాహం జరిపించేందుకు నిర్ణయించారు. ఈ క్రమంలోనే పెళ్లి పత్రికలు పంచేందుకు హన్మంత్‌చారి దంపతులు లింగంపల్లిలోని బంధువుల ఇంటికి మధ్యాహ్నం వెళ్లారు.

సాయంత్రం వచ్చి చూడగా సాహితి ఇంట్లోని ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొని కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. పెళ్లి ఇష్టం లేక ఆత్మహత్య చేసుకుందా..? లేక మరే ఇతర కారణాలున్నాయా..? అనే విషయాలు దర్యాప్తులో తేలుతాయని పోలీసులు తెలిపారు.   

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ