జేఈఈ మెయిన్స్లో సత్తాచాటిన గిరిజన బాలికలు
లాక్డౌన్ దెబ్బ.. ఆర్థిక ఇబ్బందులు తాళలేక
Published on Sat, 06/05/2021 - 21:08
సాక్షి, మేడ్చల్ : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ తండ్రి, కుమారుడితో కలిసి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ సంఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బండ్లగూడా ఈడెన్ గార్డెన్ కాలనీలో ఉండే దూదేకుల ప్రవీణ్ కుమార్(39) లాక్డౌన్ కారణంగా ఆర్థికంగా బాగా చితికిపోయాడు. ఈ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు తాళలేక శనివారం కుమారుడు యశ్వంత్(6) ఒంటిపై కిరోసిన్ పోసి,తాను పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్న కీసర పోలీసులు 108లో ఉస్మానియా హాస్పిటల్కు వెద్యానికి తరలించారు.
#
Tags