మావోయిస్టుల ఊచకోత.. 25 మంది హత్య

Published on Thu, 10/08/2020 - 20:39

బస్తర్‌ : ఇన్‌ఫార్మర్ల నెపంతో మావోయిస్టులు దారుణానికి ఒడిగట్టారు. ఏకంగా 25 మంది గిరిజనులు హతమార్చి ఊచకోతకు పాల్పడ్డారు. ఈ మేరకు మావోయిస్ట్‌ పార్టీ దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ గురువారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బీజాపూర్‌ జిల్లాలో పోలీస్‌ అధికారులు నియమించిన 12 మంది రహస్య ఏజెంట్లను, ఐదుగురు కోవర్టులు, 8 మంది ఇన్‌ఫార్మర్‌లను ప్రజల భాగస్వామ్యంతో, ప్రజల మద్దతుతో ప్రజా కోర్టులో శిక్షించామని పేర్కొంది. ఉద్యమ ప్రాంతంలో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పేందుకు, విప్లవోద్యమాన్ని కాపాడేందుకు ఈ చర్యకు ఉపక్రమించామని తెలిపింది. ఈ ఘటనకు బస్తర్‌ పోలీస్‌ ఐజీ సుందర్‌ రాజ్‌, బీజాపూర్‌ ఎస్‌పీలే అని మావోయిస్ట్‌ పార్టీ తన ప్రకటన ద్వారా వెల్లడించింది. గతకొంతకాలంగా వీరు మావోయిస్టులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించింది. 

‘ఇటీవల కాలంలో ఛత్తీస్‌గఢ్‌-తెలంగాణ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున మావోయిస్టులు వస్తున్నారని, పోలీసులే బాంబులు పెట్టి అమాయకులు చంపి తమపై పెద్ద ఎత్తున విష ప్రచారం చేస్తున్నారు. ఇటీవల కాలంలో 8 మంది పార్టీ నేతలను ఎన్‌కౌంటర్‌ చేశారు. కార్యకర్తలను హత్య చేశారు. డీజీపీలు, ఐజీలు హెలికాప్టర్లలతో తిరుగుతూ, కూంబింగ్‌ చేస్తూ ప్రజలను భయకంపితులకు గురిచేస్తున్నారు. ఈ పాశవిక దామనకాండను ఖండిస్తూ 25 మంది ఏజెంట్లను ప్రజాకోర్టులో శిక్షించాం’ అని  మావోయిస్ట్‌ పార్టీ దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ పేర్కొంది. 
 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ