'రౌడీషీట్ పెట్టండి.. వాడి అంతు చూస్తా'

Published on Mon, 10/26/2020 - 11:23

సాక్షి, హైదరాబాద్‌: బోడుప్పల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ సామల బుచ్చిరెడ్డితో తనకు ప్రాణహాని ఉందని ఓ యువకుడు మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకెళ్తే.. కార్పొరేషన్‌ పరిధిలోని సర్వే నంబర్‌ 71, 72, 73 ప్లాట్‌ నంబర్‌ 35, 36 పార్ట్‌ స్థలంలో తన బంధవులు ఇల్లు నిర్మాణం చేసుకుంటే మేయర్‌ అనుచరులు ఆ ఇంటిని జేసీబీతో నేలమట్టం చేశారని శివకిషోర్‌ అనే యువకుడు ఆరోపించాడు.

ఈ క్రమంలోనే శివకిషోర్‌.. ఎందుకు ఇల్లు కూలగొడుతున్నారని మేయర్‌ను ప్రశ్నించగా నువ్వెవడు రా..? అని పరుష పదజాలంతో దూషించి, ఏడుగురు వ్యక్తులు రాళ్ల దాడికి దిగినట్లు బాధితుడు వివరించారు. విషయంపై ఫిర్యాదు చేయడానికి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్తే వీడిపై రౌడీషీట్‌ పెట్టండి. తర్వాత వాడి అంతుచూస్తానని మేయర్‌ సామల బుచ్చిరెడ్డి బెదిరించినట్లు బాధితుడు పేర్కొన్నారు. (కస్టమర్‌ కేర్‌ కాదు.. ఖాతా కొల్లగొట్టుడే!)

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ