అలల్లో కరిగిన కలలు

Published on Mon, 01/03/2022 - 08:56

సూల్‌పురా: నూతన సంవత్సర వేడుకల్లో సరదాగా గడిపేందుకు నగరానికి చెందిన 8 మంది మిత్రులు విశాఖపట్టణం వెళ్లారు. ఆర్‌కే బీచ్‌లో దిగి ఎంజాయ్‌ చేస్తుండగా ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. వీరిలో ఒకరి మృతదేహం సముద్ర తీరానికి కొట్టుకువచ్చింది. రసూల్‌పురాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ దుర్ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు, వైజాగ్‌ వెళ్లిన సిద్ధు అనే యువకుడు అందించిన వివరాల ప్రకారం.. రసూల్‌పురా 105 గల్లీకి చెందిన యువకులు శివకుమార్, అజీజ్, శివ, వినోద్, మధు, పవన్, సిద్ధు, కార్తీక్‌లు కలిసి డిసెంబరు 30న కాచిగూడ రైల్వే స్టేషన్‌ నుంచి విశాఖపట్టణం వెళ్లేందుకు బయలుదేరారు.

ఆ రోజు రైలు టికెట్లు దొరక్కపోవడంతో 31న ఉదయం వెళ్లారు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో వీరంతా ఆర్కే బీచ్‌ వద్దకు బయలుదేరారు. వీరిలో అయిదుగురు ఒడ్డున ఉండగా శివకుమార్, అజీజ్, శివ సముద్రంలోకి దిగారు. ఈ క్రమంలో అలల «ఉద్ధృతికి ముగ్గురూ సముద్రంలోకి కొట్టుకుపోయారు. శివ మృతదేహం లభించింది. అజీజ్, శివకుమార్‌లు గల్లంతయ్యారు. ఘటన సమాచారం అందగానే రసూల్‌పురా నుంచి యువకుల తల్లిదండ్రులు, స్నేహితులు విశాఖకు బయలుదేరారు. 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ