ఉక్రెయిన్‌లో బిక్కుబిక్కుమంటూ తెలంగాణ విద్యార్థులు.. రంగంలోకి బండి సంజయ్‌

Published on Thu, 02/24/2022 - 16:28

సాక్షి, న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించడంతో అక్కడ భయానక వాతావరణం చోటుచేసుకుంది. దీంతో ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులపై ఇండియాలో ఉన్న వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు. తమ వారిని క్షేమంగా స్వదేశానికి తిరిగి తీసుకురావాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

ఈ క్రమంలోనే కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌కు జిల్లాకు చెందిన విద్యార్థులు ఉక్రెయిన్‌లో చిక్కుకున్నట్టు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. కరీంనగర్‌కు చెందిన కడారి సుమాంజలి అనే విద్యార్థిని ఉక్రెయిన్‌ రాజధాని కైవ్‌ సమీపంలోని బోరిస్పిల్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో చిక్కుకున్నట్టు ఆమె కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెతో పాటు జిల్లాకు చెందిన మరో 20 మంది విద్యార్థులు సైతం విమానాశ్రయంలోనే ఉండిపోయారని పేర్కొన్నారు. వారిని సురక్షితంగా స్వదేశానికి తరలించారని పేరెంట్స్‌ ఎంపీని కోరారు. 

ఈ నేపథ్యంలో బండి సంజయ్‌.. భారత విదేశాంగ మంత్రి జయశంకర్‌కు సమాచారం అందించారు.  కరీంనగర్‌ విద్యార్థిని సుమాంజలి, ఆమె స్నేహితులు( శ్రీనిధి, రమ్యశ్రీ, లిఖిత)తో పాటు తెలంగాణాలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఉక్రెయిన్ చిక్కుకున్నారని తెలిపారు. కాగా, ఈ నలుగురు విద్యార్ధులు భారత్‌కు తిరిగి వచ‍్చేందుకు ఎయిరిండియా ఫ్లైట్ (AI-1946) కోసం టిక్కెట్లు బుక్ చేసుకున్నారని చెప్పారు. కానీ, వీరు విమానాశ్రయానికి చేరుకునే సమయానికి, అధికారులు ఎయిర్‌పోర్టును మూసివేశారు, ఫలితంగా వారందరూ విమానాశ్రయంలో చిక్కుకున్నారు. దీంతో వారు బయటకు వెళ్లలేని పరిస్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. కాగా, తెలంగాణకు చెందిన విద్యార్థులను సురక్షితంగా రాష్ట్రానికి తరలించేందుకు భారత రాయబార కార్యాలయం చొరవ తీసుకోవాలని ఆయన అభ్యర్థించారు.

సంజయ్ లేఖకు స్పందిస్తూ.. విదేశాంగ మంత్రిత్వ శాఖలోని అధికారులు ఉక్రెయిన్ ప్రభుత్వంతో సంప్రదింపులు ప్రారంభించినట్టు వెల్లడించారు. విద్యార్థులందరూ స్వదేశానికి తిరిగి వచ్చేలా చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. 

Videos

స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!

టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

ముస్లిం రిజర్వేషన్లపై.. పీఎం మోడీ కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు మేనిఫెస్టో మాయలు

టీడీపీ మేనిఫెస్టోలో మోదీ ఫొటో వద్దని బీజేపీ తేల్చేసింది..!

చిరంజీవి పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయిన కేఏ పాల్

చంద్రబాబును ఉతికారేసిన జగన్

ఈ రెండు ఉదాహరణలు గుర్తుంచుకోండి..!

కుండబద్దలు కొట్టిన బీజేపీ.. టీడీపీ మేనిఫెస్టోకు దూరం

మైదుకూరులో జనసునామి

షర్మిల బండారం బయటపెట్టిన కాంగ్రెస్ నేత

టీడీపీ నుండి YSRCPలోకి 500 కుటుంబాలు

చంద్రన్న కాంగ్రెస్ కు సీఎం జగన్ కౌంటర్..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కలికిరి (అన్నమయ్య జిల్లా)

జనసేన నాయకురాలిపై.. చింతమనేని ఆగ్రహం

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

Photos

+5

జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)