మునిగిపోయిన సబ్‌మెరైన్‌.. 53 మంది గల్లంతు

Published on Thu, 04/22/2021 - 11:31

జకార్తా: 53 మంది సభ్యులతో కూడిన సబ్‌మెరైన్‌ గల్లంతైంది. ఈ దారుణం ఇండోనేషియాలో బుధవారం చోటు చేసుకుంది. మిలిటరీ చీఫ్‌ హదీ తహ్జం తెలిపిన వివరాల ప్రకారం.. మిలిటరీ ట్రైనింగ్‌ ఎక్సర్‌సైజ్‌ నిర్వహిస్తుండగా ‘కేఆర్‌ఐ నంగాల 402 సబ్‌మెరైన్‌’ గల్లంతైందని తెలిపారు. బాలి దీవి ఉత్తర తీరం నుంచి నీటిపై 95 కిలోమీటర్ల దూరం తర్వాత దాని నుంచి సిగ్నల్స్‌ సరిగా రాలేదు. ఎంత సేపటికీ ఆ సబ్‌మెరైన్‌ నుంచి ఎటువంటి సమాచరం రాకపోవడం, సిగ్నల్స్‌ మొత్తంగా బ్లాక్‌ కావడంతో మునిగిపోయినట్లు భావిస్తున్నామని తెలిపారు.  మెరైన్‌ను కనుగొనేందుకు సింగపూర్, ఆస్ట్రేలియాల సాయం కోరామని ఆయన అన్నారు. 

హైడ్రోగ్రాఫిక్‌ సర్వే షిప్‌ సైతం నీటి మీద తిరుగుతూ మెరైన్‌ జాడను పసిగట్టే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇంకా స్పష్టమైన ఆచూకీ తెలియడం లేదు. ఇండోనేషియా మీడియా చూపిస్తున్న వివరాల ప్రకారం సముద్ర మట్టం నుంచి 2,300 అడుగుల లోతులో అది మునిగిపోయినట్లు తెలుస్తోంది. సబ్‌మెరైన్‌ ప్రారంభమైన చోట ఆయిల్‌ లీకైన జాడలను ఓ హెలికాప్టర్‌ గుర్తించిందని అందులో పేర్కొన్నారు. బహుశా ఈ ప్రమాదానికి కారణం ఆయిల్‌ లీకేనని అధికారులు భావిస్తున్నారు.

( చదవండి: జార్జ్‌ ఫ్లాయిడ్‌ హత్యకేసు: అతడే దోషి )

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ