ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కుంభకోణం!

Published on Fri, 09/18/2020 - 11:49

మంచు విష్ణు, కాజల్‌ అగర్వాల్‌ జంటగా నటిస్తున్న ‘మోసగాళ్ళు’  సినిమా మోష‌న్ పోస్ట‌ర్ శుక్రవారం విడుద‌లైంది. జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వంలో  ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్‌, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ బ్యానర్‌పై విష్ణు మంచు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా మోష‌న్ పోస్ట‌ర్‌ను హీరో ద‌గ్గుబాటి వెంక‌టేష్ లాంచ్ చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కుంభకోణం నేపథ్యంలో రూపొందుతున్న హాలీవుడ్‌–ఇండియన్ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటుంది.

ఇక మ‌రో విశేషం ఏంటంటే  ఈ సినిమాలో విష్ణు–కాజల్‌ అగర్వాల్‌ బ్రదర్‌ అండ్‌ సిస్టర్‌ పాత్రలు చేస్తున్నారని చిత్ర యూనిట్ ఇదివ‌రకే ప్ర‌క‌టించింది. దీంతో అస‌లు వీరిద్ద‌రి పాత్రలు ఎలా ఉండ‌బోతున్నాయ‌న్న స‌స్పెన్స్ అభిమానుల్లో నెల‌కొంది. ఇక ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ ఏసీపీ కుమార్‌ పాత్రలో బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి నటిస్తున్నాడు. వేసవిలోనే ‘మోసగాళ్లు’ విడుదల కావాల్సి ఉండగా, కరోనా కార‌ణంగ‌గా  వాయిదా పడింది. దీంతో మ‌రి థియేట‌ర్స్ తెరిచేవ‌ర‌కు చిత్ర‌బృందం వెయిట్ చేస్తుందా లేక ఓటీటీ వైపు వెళ్తుందా అన్న‌ది తెలియాల్సి ఉంది. (బ్రదర్‌ అండ్‌ సిస్టర్‌)

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ