ఈ వార్త తీవ్రంగా కలిచివేసింది: సాయి ధరమ్ తేజ్

Published on Sat, 01/28/2023 - 17:08

సినీ నటుడు నందమూరి తారకరత్న పరిస్థితి అత్యంత విషమంగా ఉందని బెంగళూరు ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఎక్మోపై చికిత్స అందిస్తున్నామని స్పష్టం చేశారు. ఆయన ఆరోగ్యాన్ని 10 మంది వైద్యుల బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని తెలిపారు. ఈ వార్త విన్న సినీ ప్రముఖులు తారకరత్న కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఇప్పటికే నందమూరి కల్యాణ్‌రామ్ ట్వీట్ చేయగా.. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తారకరత్న ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఈ వార్త తనకు తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. 

ట్వీట్‌ సాయి ధరమ్ తేజ్ రాస్తూ..' ఈ వార్త నన్ను తీవ్రంగా కలిచివేసింది. తారకరత్న అన్న త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. మీరు ఆరోగ్యంగా, మరింత దృఢంగా తిరిగి రావాలని ఆ దేవుడిని ఆశిస‍్తున్నా. మా ప్రార్థనలు మీకు ఎప్పుడు అండగా ఉంటాయి. ' అని పోస్ట్ చేశారు.  తారకరత్న ఆరోగ్య పరిస్థితి మాత్రం ఇంకా క్రిటికల్‌గానే ఉందని వైద్యులు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసిన నేపథ్యంలో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ