మహేశ్‌ బాబు సరసన మాస్‌ మహారాజా హీరోయిన్‌

Published on Fri, 10/22/2021 - 08:50

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు- త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించినప్పుటి నుంచి దీనికి సంబంధించిన అప్‌డేట్స్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన మరో ఆసక్తికర అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో మహేశ్‌ సరసన అప్‌కమింగ్‌ హీరోయిన్‌, మోడల్‌, మిస్‌ ఇండియా మీనాక్షి చౌదరి నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ‘ఇచట వాహనములు నిలుపరాదు’ చిత్రంతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన ఆమె ఇప్పటికే మాస్‌ మహారాజా రవితేజ ‘ఖిలాడీ’ చిత్రంలో నటించే చాన్స్‌ కొట్టెసింది. 

ఈ క్రమంలో ఆమె త్రీవిక్రమ్‌-మహేశ్‌ కాంబినేషన్‌లో రాబోయే చిత్రంలో సెకండ్‌ హీరోయిన్‌గా ఆమెను ఎంపిక చేసినట్లు వినికిడి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా మీనాక్షిని ‘సలార్‌’లో ప్రభాస్‌కు సెకండ్‌ హీరోయిన్‌గా తీసుకుంటున్నట్లు వార్తలు వినిపించాయి. ప్రస్తుతం మ‌హేశ్, డైరెక్ట‌ర్ ప‌ర‌శురాంతో చేస్తున్న స‌ర్కారు వారి పాట షూటింగ్‌ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా పూర్త‌యిన వెంట‌నే త్రివిక్ర‌మ్ చిత్రాన్నిసెట్స్ పైకి తీసుకెళ్ల‌నున్నాడు. ఈ చిత్రంలో మెయిన్‌ హీరోయిన్‌గా పూజ హెగ్డే పేరు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ