నవ్వులు పూయిస్తున్న ‘ముగ్గురు మొన‌గాళ్లు’

Published on Tue, 05/25/2021 - 15:26

Mugguru Monagallu: టాలీవుడ్‌ స్టార్‌ కెమెడియన్‌ శ్రీనివాస్‌ రెడ్డి హీరోగా,  దీక్షిత్ శెట్టి, వెన్నెల రామారావు ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కుతోన్న చిత్రం ‘ముగ్గ‌రు మొన‌గాళ్లు’. ఈ సినిమాతో అభిలాష్ రెడ్డి అనే కొత్త‌ దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. వినికిడి లోపం, అంధత్వం, మూగతనం లాంటి సమస్యలతో బాధపడుతున్న ముగ్గురు మిత్రుల కథ ఇది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ విడుదలైంది.

 2 నిమిషాల 15 సెకనుల నిడివితో కూడిన ఈ ట్రైలర్‌లో శ్రీనివాస్ రెడ్డి చెవిటి వాడిగా, దీక్షిత్ శెట్టి మూగ వాడిగా, వెన్నెల రామారావు అంధుడిగా కనిపించి తమదైన కామెడీతో నవ్వులు పూయించారు. స‌ర‌దాగా సాగుతూనే ఓ మిస్ట‌రీ కేసు అంశంతో ఉత్కంఠ పెంచుతోంది ఈ ట్రైల‌ర్‌. మ‌రి ఆ హ‌త్య కేసు ఏంటి? వీళ్ల‌కి దానికి సంబంధం ఏంటి?  పోలీసులు ఈ అమ‌యాకుల్ని ఎందుకు అరెస్ట్ చేశారు? త‌దిత‌ర ఆస‌క్తికర విష‌యాలన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో దివంగ‌త న‌టుడు, జర్నలిస్టు టీఎన్ఆర్  కీల‌క పాత్రలు పోషించారు. రిత్విష్‌ శర్మ, శ్వేతా వర్మ హీరోయిన్స్‌గా నటించారు. చిత్రమందిర్‌ స్టూడియోస్‌ పతాకంపై అచ్యుత్‌ రామరావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ