ప్రముఖ గాయని మృతి.. సెలబ్రిటీల సంతాపం

Published on Mon, 06/21/2021 - 11:31

భువనేశ్వర్‌: అనారోగ్యంతో ప్రముఖ గాయని తప్పూ మిశ్రా శనివారం అర్ధరాత్రి కన్నుమూశారు. పదహారేళ్ల వయసులో సినీరంగ ప్రవేశం చేసిన ఈమె కొన్ని వేల పాటలు పాడి శ్రోతలకు వీనులవిందు కలిగించారు. గీతాలాపనలో ఈమె చూపిన అత్యుత్తమ ప్రతిభకి 4 రాష్ట్ర చలనచిత్ర అవార్డులు రావడం విశేషం. మొత్తం 160 ఒడియా సినిమాలు, 22 బెంగాళీ చిత్రాల్లో ఈమె పాటలు పాడింది.

ఇటీవల కరోనా మహమ్మారి బారినపడి కోలుకున్నారు. అయితే ఇంటికి చేరిన కొన్నిరోజులకే ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో మంచాన పడిన ఈమె చికిత్సకు రాష్ట్ర సాంస్కృతిక శాఖ కళాకారుల సంక్షేమ నిధి నుంచి రూ.1 లక్ష ఆర్థిక సహాయం చేసిన విషయం తెలిసిందే. తప్పూ మిశ్ర మృతితో ఒడియా చలన చిత్ర రంగంలో విషాద ఛాయలు అలముకున్నాయి. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఈమె మృతికి సంతాపం ప్రకటించారు. 

చదవండి : మరో బిజినెస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న సమంత
దర్శకుడు సుశీంద్రన్‌ రూ.5 లక్షల విరాళం

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ