సినిమా టికెట్ల అంశంపై స్పందించిన దిల్‌రాజు

Published on Tue, 12/28/2021 - 08:14

Producer Dil Raju Comments On Ap Ticket Issue: ‘‘ప్రేక్షకులను, సినిమా ఇండస్ట్రీని బ్యాలెన్స్‌ చేయాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ఉంది. ఇలాంటి అంశాలపై చర్చించేందుకు ఏపీ ప్రభుత్వం ఓ కమిటీ ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకోవడం శుభ పరిణామం’’ అని నిర్మాత ‘దిల్‌’ రాజు అన్నారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ–‘‘మా ఇబ్బందులు ఏంటి? అనేది ప్రభుత్వానికి ఇప్పటికీ కచ్చితంగా తెలియడం లేదు. టిక్కెట్ల ధర పెంపు, 5వ ఆటకు అనుమతి వంటి అంశాలపై చర్చించేందుకు ఏపీ ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేయనుంది. ఈ కమిటీలో ప్రభుత్వ ప్రతినిధులతో పాటు ఇండస్ట్రీ నుంచి ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్‌ ఉంటారు.

తెలుగు ఫిల్మ్‌ చాంబర్‌ నుంచి ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి కొన్ని పేర్లు కూడా పంపించారు. త్వరలోనే కమిటీని నియమిస్తారు. కమిటీ వల్ల ఇరువైపులా చర్చించేందుకు ఎక్కువ సమయం దొరుకుతుంది. ఈ కమిటీలోని వాళ్లు ఇండస్ట్రీ సాధక బాధకాలు ప్రభుత్వానికి వినిపించి, సమస్య పరిష్కారానికి కృషి చేస్తారు. అప్పటి వరకు ఫిల్మ్‌ ఇండస్ట్రీ నుంచి ఎవరూ సోషల్‌ మీడియా పోస్టులు చేయకపోవడం, మాట్లాడకపోవడం మంచిది. ప్రభుత్వం నుంచే స్పందన వచ్చి సమస్యల పరిష్కారానికి ఓ కమిటీ వేశారు కాబట్టి త్వరలోనే పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నాం. మాకు అపాయింట్‌మెంట్‌ ఇస్తే ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారిని, మంత్రి పేర్ని నానిగారిని కలవాలనుకుంటున్నాం.

ఇటు ఇండస్ట్రీకి అటు సొసైటీకి, ప్రభుత్వాలకు మధ్య మీడియాది చాలా కీలక పాత్ర. మాలో భాగమైన మీడియా కూడా ఇండస్ట్రీ వార్తలను సున్నితమైనవిగా చూడాలి కానీ సెన్సేషన్‌ చేయొద్దని కోరుకుంటున్నాం. ఇప్పటి పరిస్థితులను పాజిటివ్‌గానే తీసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి కూడా త్వరలోనే టిక్కెట్ల విషయంలో కొత్త జీవో వస్తుందని ఆశిస్తున్నాం. నిర్మాతల, ఎగ్జిబిటర్ల సమస్యలు వేర్వేరు. అన్ని సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళితే పరిష్కారం అవుతాయనే నమ్మకం ఉంది.

కమిటీ ఏర్పాటైన తర్వాత కూడా ప్రస్తుత అంశాలు పరిష్కారం కాకుంటే అన్ని క్రాఫ్ట్స్‌ వారు కూర్చుని ఎలా చేస్తే బాగుంటుందని అప్పుడు ఆలోచించుకుని మాట్లాడదాం.. దయచేసి అప్పటి వరకూ ఎవరూ స్పందించ వద్దు. కష్టమో, నష్టమో సినిమాల విడుదలను ఆపుకోలేం.. పెద్ద సినిమాలను అస్సలు ఆపుకోలేం. రిలీజ్‌కి రెడీగా ఉన్న వాటిని విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం. తెలంగాణలో కొత్త టిక్కెట్‌ ధరలను నిర్ణయించి జీవో ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌గారికి, మంత్రి తలసానిగారికి నిర్మాతల తరఫున థ్యాంక్స్‌’’ అన్నారు. ఈ సమావేశంలో నిర్మాతలు ‘స్రవంతి’ రవికిశోర్, వంశీ పాల్గొన్నారు.  

Videos

ఈ రెండు ఉదాహరణలు గుర్తుంచుకోండి..!

కుండబద్దలు కొట్టిన బీజేపీ.. టీడీపీ మేనిఫెస్టోకు దూరం

మైదుకూరులో జనసునామి

షర్మిల బండారం బయటపెట్టిన కాంగ్రెస్ నేత

టీడీపీ నుండి YSRCPలోకి 500 కుటుంబాలు

చంద్రన్న కాంగ్రెస్ కు సీఎం జగన్ కౌంటర్..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కలికిరి (అన్నమయ్య జిల్లా)

జనసేన నాయకురాలిపై.. చింతమనేని ఆగ్రహం

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

మన ప్రశ్నలకు బాబు, పురందేశ్వరి, పవన్ కు పిచ్చి, పిచ్చి కోపం వస్తుందంటా..!

వీళ్ళే మన అభ్యర్థులు.. గెలిపించాల్సిన బాధ్యత మీదే..!

కొడాలి నాని ఎన్నికల ప్రచారం.. బ్రహ్మరథం పట్టిన గుడివాడ ప్రజలు

జనంతో కిక్కిరిసిన మైదుకూరు

జగన్ గెలుపుకు అర్ధం..!

Photos

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)