వైభవంగా నిర్మాత కొడుకు వివాహం!

Published on Thu, 07/30/2020 - 12:24

సాక్షి, హైదరాబాద్: నిర్మాత వల్లూరుపల్లి రమేష్‌ కుమారుడు రాఘవేంద్ర మహర్షి వివాహం బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లోని అవాస హోటల్‌లో జరిగింది. సాంబ శివరావు- శ్రీదేవి దంపతుల కుమార్తె శ్రీజను మహర్షి పెళ్లాడారు. ఈ అందమైన జంటను ఆశీర్వదించడానికి పలువురు సినీ ప్రముఖులు వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. హీరో శ్రీకాంత్‌, ప్రముఖ నిర్మాతలు జెమిని కిరణ్‌, సురేష్‌ కొండేటి తదితరులు ఈ వేడకకు హాజరయ్యి వధూవరులను ఆశీర్వదించారు.

కరోనా నేపథ్యంలో ప్రభుత్వం మార్గదర్శకాలు పాటిస్తూ కొద్దిమంది బంధు మిత్రుల సమక్షంలో ఈ వివాహ వేడుక జరిగిందని వల్లూరుపల్లి రమేష్‌బాబు-గీత దంపతులు వెల్లడించారు. ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు, గోపి గోపిక గోదావరి, కబడ్డీ కబడ్డీ, పందెం లాంటి విజయవంతమైన చిత్రాలను వల్లూరుపల్లి రమేష్‌ బాబు నిర్మించారు. 
చదవండి: పెళ్లికి రెడీ అవుతోన్న‌ 'ప‌హిల్వాన్' విల‌న్

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ