ఈ విజయం వారిదే: రాజేంద్రప్రసాద్‌

Published on Tue, 12/20/2022 - 09:57

‘‘చిన్న సినిమా, పెద్ద సినిమా అని కాకుండా కంటెంట్‌ ఉన్న సినిమా తీస్తే ఆదరిస్తామని ప్రేక్షకులు మరోసారి మా ‘శాసనసభ’తో నిరూపించారు. ఈ విజయం వారిదే’’ అని నటుడు రాజేంద్ర ప్రసాద్‌ అన్నారు. ఇంద్రసేన, ఐశ్వర్యా రాజ్‌ జంటగా వేణు మడికంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శాసన  సభ’. తులసీరామ్‌ సాప్పని, షణ్ముగం సాప్పని నిర్మించిన ఈ సినిమా ఈ నెల 16న విడుదలైంది.

ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్‌ మీట్‌లో ఈ చిత్రంలో కీలక పాత్ర చేసిన రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ– ‘‘శాసనసభ’లో నేను చేసిన నారాయణ స్వామి పాత్రకి మంచి పేరొచ్చిందంటే దానికి కారణం రచయిత రాఘవేందర్‌ రెడ్డి, దర్శకుడు వేణు.. నాది మూడో స్థానం. సినిమా విడుదలైన మూడో రోజే 60 థియేటర్స్‌ పెరగడం సంతోషంగా ఉంది’’ అన్నారు. ఈ చిత్రవిజయం పట్ల యూనిట్‌ ఆనందం వ్యక్తం చేసింది.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ