పండంటి బిడ్డకు జన్మనిచ్చిన రజనీకాంత్‌ కూతురు

Published on Mon, 09/12/2022 - 14:53

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ మరోసారి తాతయ్య అయ్యారు. ఆయన రెండో కుమార్తె సౌందర్య రజనీకాంత్‌ రెండవసారి తల్లయ్యారు. ఆదివారం ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. దేవుని దయ, మా తల్లిదండ్రుల ఆశీర్వాదాలతో వేద్‌ కృష్ణ తమ్ముడికి స్వాగతం పలుకుతున్నాం. ఆదివారం(సెప్టెంబర్‌ 11) వీర్‌ రజనీకాంత్‌ వనంగమూడి మా జీవితాల్లోకి వచ్చాడని మీతో పంచుకోవడం సంతోషంగా ఉంది’ అంటూ ఆమె శుభవార్త పంచుకున్నారు.

చదవండి: కృష్ణంరాజు మొదటి భార్య ఎలా చనిపోయిందో తెలుసా?

అంతేకాదు చిన్నారికి వీర్‌ రజనీకాంత్‌ వనంగమూడిగా పేరు పెట్టినట్లు ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు. కాగా గ్రాఫిక్‌ డిజైనర్‌, నిర్మాతగా సౌందర్య కోలీవుడ్‌లో రాణిస్తున్నారు. ఓచెర్‌ పిక్చర్స్‌ ప్రొడక్షన్‌ సంస్థ ద్వారా పలు సినిమాలను తెరకెక్కిస్తున్న ఆమె తన తండ్రి రజనీకాంత్‌ విక్రమసింహ సినిమాతో దర్శకురాలిగా మారారు. 2017లో మొదటి భర్త అశ్విన్‌ రామ్‌కుమార్‌ నుంచి విడాకులు తీసుకున్న సౌందర్య.. 2019లో నటుడు, వ్యాపారవేత్త విషగన్‌ వనంగమూడిని రెండో వివాహం చేసుకున్నారు. తాజాగా వీరిద్దరికి తొలి సంతానంగా నిన్న(ఆదివారం) వీర్‌ జన్మించాడు. 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ