సల్మాన్‌ ఖాన్‌ పరువునష్టం దావా కొట్టివేత

Published on Sat, 01/15/2022 - 10:47

బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ దాఖలు చేసిన పరువునష్టం దావా పిటిషన్‌ను ముంబై సిటీ సివిల్‌ కోర్టు శుక్రవారం కొట్టివేసింది. ముంబైలోని పన్వేల్‌ ప్రాంతంలో సల్మాన్‌ ఖాన్‌ ఫాంహౌజ్‌ పక్కనే ఉన్న ఓ స్థలాన్ని ఖేతన్‌ కక్కడ్‌ అనే వ్యక్తి కొనుగోలు చేశారు.

అయితే ఖేతన్‌ కక్కడ్‌ ఓ యూట్యూబ్‌ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ తనపైనా, తన ఫాంహౌస్‌పైనా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తన పరువుకు నష్టం చేకూర్చేవిధంగా ఉన్నాయని, భవిష్యత్తులో తనపై అటువంటి వ్యాఖ్యలు చేయకుండా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని, ఇంటర్వ్యూ భాగం నుంచి ఆ వ్యాఖ్యలు తొలగించాలని కోరుతూ ముంబై సిటీ సివిల్‌ కోర్టులో పరువునష్టం వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.

అయితే ఈ పిటిషన్‌ను కోర్టు విచారణకు తిరస్కరించింది. ఖేతన్‌ కక్కడ్‌పై వస్తున్న ఆరోపణలపై వివరణ ఇవ్వాలని, దీనిపై తదుపరి విచారణను ఈనెల 21కి వాయిదా వేస్తూ జడ్జి అనిల్‌ హెచ్‌ లద్దాద్‌ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ