ముంబైలో ఇల్లు కొనబోతోన్న అక్కినేని కోడలు!

Published on Wed, 07/07/2021 - 20:37

మన తెలుగు హీరోయిన్స్‌ ఇటూ సినిమాల్లో నటిస్తూ మరో పక్క బిజినెస్‌లోకి అడుగు పెడుతూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఇప్పటికే మిల్కీ బ్యూటీ తమన్నా డైమండ్‌ బిజినెస్‌ ప్రారంభించగా, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ జిమ్‌ స్టార్ట్‌ చేసింది. టాలీవుడ్‌ అడుగుపెట్టిన కొద్ది రోజులకే రకుల్‌ ఇక్కడ సొంతగా ఇల్లు కొనుక్కున్న సంగతి విధితమే. ఇక అక్కినేని కోడలు, అగ్రనటి సమంత సైతం ఫ్యాషన్‌ డిజైన్స్‌లో బిజినెస్‌ మొదలు పెట్టిగా.. కొత్తగా నగల వ్యాపారంలోకి కూడా అడుగు పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో సమంతకు సంబంధించిన మరో అసక్తికర విషయం సోషల్‌ మీడయాలో హల్‌చల్‌ చేస్తోంది.

ఇటూ బిజినెస్‌ పరంగా అటూ వరుస సినిమాల్లో నటిస్తూ భారీ స్థాయిలో పారితోషికం అందుకుంటున్న సమంత రెండు చేతులా బాగానే డబ్బు సంపాదిస్తోంది. ఈ క్రమంలో ఆమె ముంబైలో ఓ ప్లాట్‌ కోనేందుకు సిద్దమైందట. ఇందుకోసం ఆమె అక్కడ మంచి ప్లాట్‌ను వేతికే పనిలో పడిందట. అయితే త్వరలోనే తన బాలీవుడ్‌ ఎంట్రీ నేపథ్యంలో ముంబై నగరంలో ఓ ఇళ్లు ఉండాలనే ఉద్దేశంతో సమంత ప్లాట్‌ను కోనాలని నిర్ణయించుకున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. ప్రస్తుతం గుణశేఖర్‌ దర్శకత్వంలో ‘శాకుంతలం’ మూవీలో నటిస్తున్న సమంత తన తదుపరి చిత్రం హిందీలో ఉండబోతున్నట్లు టాలీవుడ్‌లో టాక్‌. కాగా ఇప్పటికే మెగా హీరో రామ్‌చరణ్‌, ఉపాసనలు ముంబైలో ఓ ఇళ్లు కొన్నట్లు వినికిడి. 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ