చైతో విడిపోయినా అక్కినేని ఫ్యామిలీతో ఇంకా టచ్‌లో ఉన్న సమంత

Published on Sat, 02/04/2023 - 17:50

సమంత-నాగచైతన్య ఒకప్పుడు టాలీవుడ్‌లో మోస్ట్‌ క్యూటెస్ట్‌ కపుల్‌గా వీరికి పేరుంది. 'ఏ మాయ చేశావే' సినిమాతో తొలిసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకున్న వీరు 2017లో పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. ఆన్‌ స్క్రీన్‌ అయినా, ఆఫ్‌ స్క్రీన్‌లో అయినా వీరి కెమిస్ట్రీ చూస్తే ముచ్చటేసేది. కానీ ఏమైందో ఏమో కానీ వీరి వివాహ బంధం బీటలు వారింది. ఎంతో అన్యోన్యంగా ఉండే చై-సామ్‌లు 2021లో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దీనికి గల కారణాలు ఏంటన్నది ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది.

ఇదిలా ఉంటే నాగ చైతన్యతో విడిపోయినా అక్కినేని కుటుంబంతో మాత్రం సమంతకు ఇప్పటికీ మంచి అనుబంధం ఉందన్నది పలుమార్లు రుజువైంది. తాజాగా అక్కినేని అఖిల్‌, షేర్‌ చేసిన ఓ పోస్ట్‌కు సైతం సమంత స్పందించింది. స్టైలిష్‌ డైరెక్టర్‌ సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో అఖిల్‌ నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ఏజెంట్‌. 

స్పై యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్‌ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్నట్లు మేకర్స్‌ అనౌన్స్‌ చేశారు.దీనికి సంబంధించి ఓ పవర్‌ఫుల్‌ వీడియోను కూడా వదిలారు. తాజాగా ఈ వీడియోను పోస్ట్‌ చేస్తూ అఖిల్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసుకోగా దీనికి సమంత లైక్‌ కొట్టడంతో పాటు 'బీస్ట్‌ మోడ్‌' అంటూ కామెంట్‌ చేసింది. 

నాగచైతన్యతో విడిపోయిన తర్వాత కూడా గతేడాది అఖిల్‌ బర్త్‌డేకు సామ్‌ విష్‌ చేసిన సంగతి తెలిసిందే. రీసెంట్‌గా సమంత శాకుంతలం పోస్ట్‌ను హీరో సుశాంత్‌ తన ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేశాడు. ఇవన్నీ చూస్తుంటే చైతో డివోర్స్‌ అయినా అక్కినేని కుటుంబంతో సమంతకు మంచి రిలేషనే ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ