మృత్యుంజయుడు.. ఈ బుడతడు

Published on Tue, 06/15/2021 - 08:47

ఆగ్రా: ప్రమాదవశాత్తూ బోరు బావిలో పడిన మూడున్నరేళ్ల బాలుడిని సహాయక బృందాలు విజయవంతంగా కాపాడాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ధరిౖయె గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. ఉదయం 7.30 గంటల సమయంలో ఆడుకుంటున్న బాలుడు దగ్గర్లో ఉన్న పొలంలోని బోరు బావిలో పడిపోయాడు. ఈ విషయం వెంటనే అధికారులకు తెలియడంతో ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్, పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. 130 అడుగుల లోతున్న బోరుబావిలో 90 అడుగుల వద్ద బాలుడు చిక్కుకున్నాడు.

అధికారులు బోరుబావికి సమాంతరంగా భూమిని తవ్వి బాలున్ని సురక్షితంగా బయటకు తీశారు. బాలుడు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని జిల్లా కలెక్టర్‌ ప్రభు ఎన్‌ సింగ్‌ తెలిపారు. ఉదయం 8.30కి ప్రారంభమైన ఆపరేషన్‌ సాయంత్రం 4.35 గంటలకు ముగిసిందని ఆగ్రా ఎస్‌ఎస్‌పీ మునిరాజ్‌ తెలిపారు. తన కుమారున్ని తిరిగి ప్రాణాలతో చూడటం ఆనందంగా ఉందని బాలుడి తండ్రి ఛోటేలాల్‌ చెప్పారు. ఆరేడేళ్లుగా మూతబడి ఉన్న బోరు బావిని తిరిగి కొత్త బోరు వేసేందుకు తెరవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.

చదవండి: Ayodhya: రూ.400 కోట్లతో బస్‌స్టేషన్‌

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ