amp pages | Sakshi

కేంద్ర మంత్రి కాన్వాయ్‌పై దాడి.. మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు

Published on Wed, 02/16/2022 - 20:26

లక్నో : ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ సంచలన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అధికార బీజేపీ, ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం యూపీలోని కర్హాల్ వెళ్తుండగా మార్గమధ్యలో కేంద్ర మంత్రి సత్యపాల్ సింగ్ బఘేల్ కాన్వాయ్‌పై దాడి జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు ఆయన కాన్వాయ్‌పై రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన నుంచి బఘేల్ క్షేమంగా బయటపడ్డారు. కానీ, ఈ విషయాన్ని బీజేపీ సీరియస్‌గా తీసుకుంది. ఆయనపై సమాజ్‌వాదీ పార్టీ చెందిన వారే దాడి చేశారంటూ ఆరోపించింది. 

ఈ నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ నేత, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ బుధవారం స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓడిపోతున్నారనే భయంతోనే బీజేపీ నేతలు తమపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. కేంద్రంలో వారి ప్రభుత్వమే ఉంది. శాంతి భద్రతల అంశం వారి చేతిలోనే ఉంది. యూపీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే బీజేపీ అధికారంలోకి వచ్చాకే పారిశ్రామికవేత్తలందరూ బ్యాంకులను లూటీ చేసి పారిపోతున్నారని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఇలాంటి ఘటనలు ఎక్కువవుతాయని అఖిలేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఇదిలా ఉండగా.. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి సత్యపాల్.. కర్హల్ నియోజకవర్గం బీజేపీ తరఫున నుంచి పోటీ చేస్తున్నారు. అదే నియోజకవర్గానికి సమాజ్‌వాదీ పార్టీ తరఫున యూపీ సీఎం అభ్యర్థి అఖిలేష్‌ యాదవ్‌ బరిలో ఉన్నారు.

Videos

మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య

చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న

జగన్ గారు నాకిచ్చిన బాధ్యత "కుప్పం" కుంభస్థలం బద్దలే బాబు

షర్మిల ప్రచారం అట్టర్ ఫ్లాప్..!

పవన్ కళ్యాణ్ లేదు తొక్క లేదు.. జగనన్న కోసం ప్రాణం ఇస్తా ... తగ్గేదేలే

గన్నవరంలో జోరుగా వల్లభనేని ఎన్నికల ప్రచారం

త్వరలో తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ: దేవులపల్లి అమర్

పవన్ కు పోతిన మహేష్ లేక "ప్రశ్నలు - పంచులు "

అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!

ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి

4 కంటైనర్ లలో డబ్బు రవాణా 2 వేల కోట్లు పట్టుకున్న ఏపీ పోలీసులు

చంద్రబాబు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధురాలు..!

మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం

చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది

అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?

చంద్రబాబుపై జగన్ మోహన్ రావు ఫైర్

Election Track: గెలుపు ఎవరిది ?..రాజమహేంద్రవరం ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

కార్మికులను ఆదుకున్నది సీఎం జగన్ మాత్రమే

Photos

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)