భారత్‌లో 91 లక్షలు దాటిన కరోనా కేసులు

Published on Mon, 11/23/2020 - 10:50

న్యూఢిల్లీ:  భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 44,059 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం మొత్తంగా ఇప్పటివరకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 91 లక్షలు దాటాయి. గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి 511 మంది మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 1,33,738కు చేరింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేసింది. మొత్తం కేసుల సంఖ్య 91,39,866గా ఉండగా,  ప్రస్తుతం   4,43,486 యాక్టివ్‌ కేసులున్నాయి. వారిలో ఇప్పటి వరకు 85,62,641 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో కరోనా రికవరీ రేటు 93.68 శాతంగా ఉండగా.. మరణాల రేటు 1.46శాతానికి తగ్గిందని బులెటిన్‌లో వెల్లడించింది.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ