ట్విట్టర్‌ ఎండీకి ఊరట

Published on Fri, 06/25/2021 - 08:17

బెంగళూరు/ఘజియాబాద్‌: వృద్ధ ముస్లింపై దాడి వీడియో ట్విట్టర్‌లో విస్తృతంగా షేర్‌ అయిన కేసులో ట్విట్టర్‌ ఇండియా ఎండీ మనీశ్‌ మహేశ్వరికి కర్ణాటక హైకోర్టులో ఊరట లభించింది. బలవంతంగా ఆయనపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని ఘజియాబాద్‌ పోలీసులకు హైకోర్టు సూచించింది. ఆయనను వర్చువల్‌ విధానంలో విచారించవచ్చని జస్టిస్‌ జి. నరేందర్‌ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. దీనిపై తదుపరి విచారణ అవసరమనుకుంటే జూన్‌ 29న విచారిస్తామని కోర్టు పేర్కొంది.

ఆ వీడియో మత ఘర్షణలను ప్రేరేపించేలా ఉందంటూ ట్విట్టర్‌ ఎండీ మనీశ్‌కు ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ పోలీసులు ఇటీవల నోటీసులిచ్చారు. తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అయితే, తాను వర్చువల్‌ పద్ధతిలో హాజరవుతానని మనీశ్‌ జవాబివ్వగా అందుకు ఘజియాబాద్‌ పోలీసులు నిరాకరించారు. ప్రతిగా మరో నోటీస్‌ ఇస్తూ 24 గంటల్లోపు స్వయంగా తమ ముందు హాజరై స్టేట్‌మెంట్‌ ఇవ్వాలని ఆదేశించారు. దీంతో మనీశ్‌ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. మనీశ్‌ తరఫు లాయర్‌ నగేశ్‌ వాదించారు.

చదవండి: అయేషా సుల్తానాను ప్రశ్నించి వదిలేసిన లక్షద్వీప్‌ పోలీసులు 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ