Mamata Benarjee: కరోనాపై యుద్ధం ప్రకటించిన మమత

Published on Wed, 05/05/2021 - 19:14

కలకత్తా: అసెంబ్లీ ఎన్నికలు ముగియడం.. మరోసారి ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ప్రమాణస్వీకారం చేయడంతోనే కరోనా వైరస్‌పై యుద్ధం ప్రకటించారు. కరోనా కట్టడికి కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో కఠిన ఆంక్షలు విధిస్తూ సీఎం మమత బెనర్జీ నిర్ణయించారు. ఉదయం 7 నుంచి 10 గంటల వరకు దుకాణాలకు అనుమతి ఉంటుందని సీఎం తెలిపారు. మళ్లీ తిరిగి సాయంత్రం 5 నుంచి రాత్రి 7 గంటల వరకు దుకాణాలకు సడలింపు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు.

కరోనా కట్టడి చర్యల్లో భాగంగానే రేపటి నుంచి స్థానిక రైళ్లు నిలిపివేస్తున్నట్లు సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. 50శాతం సామర్థ్యంతోనే మెట్రో రైళ్లు, ఆర్టీసీ బస్సులు నడవాలని ఆదేశాలు ఇచ్చారు. 50 శాతం సామర్థ్యంతోనే ప్రభుత్వ కార్యాలయాలు, ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే బ్యాంకులు పని చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో ఉన్నాయి. ఇక పశ్చిమ బెంగాల్‌లో అడుగుపెట్టాలంటే కోవిడ్‌ నెగెటివ్‌ రిపోర్ట్‌ ఉంటేనే అనుమతి ఇస్తున్నారు. ఈ విధంగా ప్రమాణం చేసిన తొలిరోజు నుంచే కరోనాపై మమతా బెనర్జీ చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో పెద్ద ఎత్తున కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఎన్నికల ప్రభావంతో కేసులు పెరుగుతున్నాయని తెలుస్తోంది.

చదవండి: పేదలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు

కరోనా వివాహం: నిజంగంటే ఇది బొంగుల పెళ్లి

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ