amp pages | Sakshi

రైతుల నిరసన వెనక విపక్షాలు: ప్రధాని

Published on Mon, 11/30/2020 - 19:18

వారణాసి/లక్నో: ‘దేవ్‌ దీపావళి’ కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం తన పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిలో పర్యటించారు. దీపం వెలిగించి ‘దేవ్ దీపావళి ’మహోత్సవాన్ని ప్రారంభించారు. అంతకు ముందు వారణాసిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు మోదీ. కరోనా నేపథ్యంలో నెలల విరామం తర్వాత మోదీ తన నియోజకవర్గంలో పర్యటించారు. బబత్‌పూర్‌ విమానాశ్రయంలో దిగిన మోదీ అక్కడి నుంచి ఖాజురి చేరుకున్నారు. జాతియ రహదారి 19 విస్తరణలో భాగంగా ఏర్పాటు చేసిన హందియా(ప్రయాగ్‌రాజ్‌)-రాజతలాబ్‌(వారణాసి) రహదారిని జాతికి అంకితం చేసేందుకు ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశానికి హాజరయ్యారు. ఇక ‘హర్‌ హర్‌ మహదేవ్’‌ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ ప్రజలకు ‘దేవ్‌ దీపావళి’, ‘గురునానక్‌ జయంతి’ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మోదీ మాట్లాడుతూ.. ఈ రోజు జాతికి అంకితం చేసిన రహదారి కాశీ ప్రజలతో పాటు ప్రయాగరాజ్ ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది అన్నారు. (చదవండి: సాగు చట్టాలతో రైతులకు లాభం)

గురు నానక్ జయంతి, దేవ్ దీపావళి సందర్భంగా వారణాసి మెరుగైన మౌలిక సదుపాయాలను పొందుతోంది అన్నారు మోదీ. దీని వల్ల వారణాసి, ప్రయాగ్‌రాజ్‌ రెండు ప్రాంతాలకు లాభం చేకూరుతుంది అన్నారు. 2,447 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్ట్‌ అలహాబాద్-వారణాసిల మధ్య ప్రయాణ సమయాన్ని గంటకు తగ్గించనుంది. ఇక తన ప్రసంగంలో మోదీ విపక్షాలపై విమర్శల వర్షం కురిపించారు. నూతన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న ఆందోళన వెనక విపక్షాలున్నాయని ఆరోపించారు. తప్పుడు సమాచారంతో రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. కొత్త చట్టాలు దళారుల కబంద హస్తాల నుంచి రైతులను కాపాడతాయని మోదీ తెలిపారు. (చదవండి: మీరు రైతులకు అవగాహన కల్పించండి!)

2017లో యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఉత్తరప్రదేశ్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగవంతం అయ్యిందన్నారు మోదీ. “2017కి ముందు యూపీలో మౌలిక సదుపాయాల స్థితి ఏమిటో అందరికీ తెలుసు. కానీ యోగి జీ ముఖ్యమంత్రి అయిన తరువాత మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగం పెరిగింది. ఈ రోజు యూపీని ఎక్స్‌ప్రెస్ ప్రదేశ్ అని పిలుస్తున్నారు’’ అంటూ మోదీ ఉత్తరప్రదేశ్‌ సీఎంపై ప్రశంసలు కురపించారు. 

Videos

నేడు సీఎం జగన్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇదే

మా మద్దతు సీఎం జగన్ కే

పవన్ కళ్యాణ్ కు పోతిన మహేష్ బహిరంగ లేఖ

కొల్లు రవీంద్రకు పేర్నినాని సవాల్

భారీగా పట్టుబడ్డ టీడీపీ, జనసేన డబ్బు..!

YSRCPని గెలిపించండి అని సభ సాక్షిగా చంద్రబాబు

గాంధీల కంచుకోటలో టికెట్ ఎవరికి ?

ఏపీ రాజకీయాలపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య

చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న

జగన్ గారు నాకిచ్చిన బాధ్యత "కుప్పం" కుంభస్థలం బద్దలే బాబు

షర్మిల ప్రచారం అట్టర్ ఫ్లాప్..!

పవన్ కళ్యాణ్ లేదు తొక్క లేదు.. జగనన్న కోసం ప్రాణం ఇస్తా ... తగ్గేదేలే

గన్నవరంలో జోరుగా వల్లభనేని ఎన్నికల ప్రచారం

త్వరలో తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ: దేవులపల్లి అమర్

పవన్ కు పోతిన మహేష్ లేక "ప్రశ్నలు - పంచులు "

అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!

ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి

4 కంటైనర్ లలో డబ్బు రవాణా 2 వేల కోట్లు పట్టుకున్న ఏపీ పోలీసులు

చంద్రబాబు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధురాలు..!

Photos

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)