పలు రాష్ట్రాల గవర్నర్ల మార్పు

Published on Fri, 09/10/2021 - 03:57

న్యూఢిల్లీ: దేశంలోని కొన్ని రాష్ట్రాల గవర్నర్లను మార్చడంతో పాటు ఉత్తరాఖండ్‌కు రాష్ట్రపతి కొత్త గవర్నర్‌ను నియమించారు. ప్రస్తుతం తమిళనాడు గవర్నర్‌గా ఉన్న బన్వరిలాల్‌ పురోహిత్‌ను పంజాబ్‌ గవర్నర్‌గా నియమించారు. ఇప్పటివరకు ఆయన పంజాబ్‌ గవర్నర్‌ బాధ్యతలు అదనంగా పర్యవేక్షిస్తున్నారు. నాగాలాండ్‌ గవర్నర్‌గా ఉన్న మాజీ ఐపీఎస్‌ ఆర్‌ఎన్‌ రవిని తమిళనాడు గవర్నర్‌గా నియమించారు. అసోం గవర్నర్‌ జగదీశ్‌ ముఖికి నాగాలాండ్‌ బాధ్యతలు అదనంగా అప్పగించారు. ఇటీవలే ఉత్తరాఖండ్‌ గవర్నర్‌గా ఉన్న మౌర్య రాజీనామా చేయడంతో ఆ స్థానంలో రిటైర్డ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ గురి్మత్‌ సింగ్‌ను నియమించారు. 2016లో సింగ్‌ ఆర్మీ నుంచి రిటైరయ్యారు. చైనాతో మిలటరీ వ్యవహారాల్లో ఆయన అనుభవజ్ఞుడు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ