Vaccination: తప్పించుకునేందుకు నదిలో దూకారు!

Published on Mon, 05/24/2021 - 12:42

లక్నో: ఓవైపు వ్యాక్సిన్ల కొరతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. మరోవైపు ఉత్తర్‌ప్రదేశ్‌లో కొంత మంది టీకాలు వేస్తామంటే చాలు భయంతో బెంబేలెత్తిపోతున్నారు. వైద్యాధికారులు వస్తున్నారని తెలిసి నదిలో దూకారు. ఈ వింత ఘటన యూపీలోని బారాబంకీలో శనివారం చోటుచేసుకుంది. ఈ విషయం గురించి రామ్‌నగర్‌ సబ్‌ కలెక్టర్‌ రాజీవ్‌ శుక్లా మాట్లాడుతూ.. కరోనా నిరోధక టీకాపై ఉన్న అపోహలే వల్లే సదరు గ్రామస్తులు ఇలా చేశారని చెప్పారు. కేవలం 14 మంది మాత్రమే వ్యాక్సిన్‌ తీసుకున్నారని తెలిపారు.

‘‘అదొక విషపు ఇంజక్షన్‌. వ్యాక్సిన్‌ కాదు. అందుకే మేం సరయూ నదిలో దూకాం’’ అని గ్రామస్తులు తనకు చెప్పినట్లు శుక్లా వెల్లడించారు. కాగా గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా  2, 22, 315 కోవిడ్‌ కేసులు వెలుగుచూశాయి. 4, 454 కరోనా మరణాలు సంభవించాయి. ఇక ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొత్తంగా 27,20,716 యాక్టివ్‌ కేసులున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే, ఏప్రిల్‌ 15 తర్వాత ఇప్పుడిప్పుడే కేసుల్లో తగ్గుదల నమోదు కావడం గమనార్హం.

చదవండి: వ్యాక్సినేషన్‌.. ఊళ్ల మధ్య చిచ్చు!

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ