మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య
Breaking News
ఆర్వోబీ–771పై బీటీ రోడ్డు
Published on Fri, 05/26/2023 - 00:58
సుభాష్నగర్: ఆర్మూర్ మండలంలోని గోవింద్పేట్ ఆర్వోబీ–771పై ఎంపీ అర్వింద్ ధర్మపురి చొరవతో బీటీ రోడ్డు పనులు చేపట్టారు. మూడు నెలల క్రితమే ఆర్వోబీని ఎంపీ ప్రారంభించిన విషయం తెలిసిందే. కాంట్రాక్టర్ పనులు నాసిరకంగా చేపట్టడంతో మూడు నెలలకే కంకర తేలింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఎంపీ అర్వింద్ సంబంధిత కాంట్రాక్టర్పై మండిపడ్డారు. వారం రోజుల్లోగా గోవింద్పేట్ ఆర్వోబీపై బీటీ రోడ్డు వేయాలని, లేకుంటే కఠినచర్యలు తీసుకోవాల్సి వస్తుందన్నారు. అదేసమయంలో రైల్వే అధికారులపై ఒత్తిడి పెంచారు. వారం రోజులుగా ప్రతిరోజు రైల్వే అధికారులు, కాంట్రాక్టర్తో సంప్రదిస్తూనే బీటీ రోడ్డు పనులు పూర్తయ్యేలా చొరవ తీసుకున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలకు స్పందించి ఆర్వోబీపై బీటీ రోడ్డు వేయించినందుకు ఎంపీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
Tags