టీడీపీకి ఓటు వేయను అన్నందుకు దళితుడిని కొట్టుకుంటూ..

Published on Mon, 11/15/2021 - 04:45

మాకవరపాలెం: విశాఖ జిల్లా మాకవరపాలెం మండలంలో టీడీపీకి ఓటు వేయనన్న దళితుడిపై ఆ పార్టీవారు దాడిచేసి కొట్టారు. కులం పేరుతో దూషించారు. నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు గంట్యాడ రాజు తనపై దాడిచేసి కులం పేరుతో దూషించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు.. మండలంలోని భీమబోయినపాలెం గ్రామానికి చెందిన గంట్యాడ రాజు శనివారం రాత్రి ఎస్సీ కాలనీలోని కమ్యూనిటీ భవనం వద్ద ఉన్నారు. అదే సమయంలో ఈ నెల 16న జరగనున్న ఎంపీటీసీ ఎన్నికల కోసం ప్రచారం చేస్తూ అక్కడికి వచ్చిన టీడీపీ కార్యకర్తలు తమ పార్టీకి ఓటు వేయాలని రాజును కోరారు.

తాను టీడీపీకి ఓటు వేయనని, వైఎస్సార్‌సీపీకే వేస్తానని రాజు చెప్పారు. దీంతో వారంతా ఆయనపై దాడిచేసి కొట్టుకుంటూ ఇంటికి తీసుకెళ్లారు. కులం పేరుతో నానా దుర్భాషలాడారు. గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు తనపై దాడిచేశారని, దీనిపై విచారణ చేసి తనకు న్యాయం చేయాలని రాజు పోలీసుల్ని కోరారు. గాయపడిన రాజును బంధువులు వెంటనే 108లో నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ విషయంపై ఫిర్యాదు అందిందని, విచారిస్తున్నామని ఎస్‌ఐ రామకృష్ణారావు చెప్పారు.
(చదవండి: కుప్పంలో మరోసారి టీడీపీ నేతల దౌర్జన్యం)

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ