amp pages | Sakshi

బిహార్‌ అసెంబ్లీలో నేర చరితులెక్కువ!

Published on Wed, 11/18/2020 - 19:55

పట్నా: బిహార్‌ అసెంబ్లీ విజేతల సామాజిక నేపథ్యాలను విశ్లేషించగా, గత ఎన్నికలకంటే ఈసారి ఎన్నికల్లో ధనవంతులు, నేర చరితులు ఎక్కువగా ఉన్నారు. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే, ఆర్జేడీ నాయకత్వంలో మహా కూటమితోపాటు ఏఐఎంఐఎం పార్టీలు కలిసి 2015 అసెంబ్లీ ఎన్నికల్లో 54.5 శాతం టిక్కెట్లను క్రిమినల్‌ కేసులను ఎదుర్కొంటున్న అభ్యర్థులకు ఇవ్వగా, 58.2 శాతం మంది విజయం సాధించారు. ఈసారి ఎన్నికల్లో అవే పార్టీలు 61.7 శాతం టిక్కెట్లు ఇవ్వగా, 66.8 శాతం ఎమ్మెల్యేలు గెలిచారని ‘అసొసియేషన్‌ ఆఫ్‌ డెమోక్రటిక్‌ రిఫామ్స్‌’ విశ్లేషణలు తెలియజేస్తున్నాయి.

2015 ఎన్నికల్లో 25 శాతం మంది అభ్యర్థులు కోటి రూపాయలు దాటిన ధనవంతులు కాగా, 2020 ఎన్నికల్లో వారి సంఖ్య 33 శాతానికి చేరుకుంది. వారిలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు మినహా ప్రధాన రాజకీయ పార్టీల తరఫున 86 శాతం మంది ధనవంతులు పోటీ చేయగా, 78 శాతం మంది విజయం సాధించారు. సీపీఐ నుంచి గెలిచిన రామ్‌ రతన్‌ సింగ్‌ బహుళ కోటీశ్వరుడు. లోక్‌జన శక్తి పార్టీ నుంచి విజయం సాధించిన రాజ్‌ కుమార్‌ సింగ్‌ 1.9 కోట్ల అధిపతి. ప్రధాన రాజకీయ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించిన అనంత్‌ కుమార్‌ సింగ్‌ నగదు ఆస్తులు 51 కోట్లు.

మొకామా నియోజకవర్గం నుంచి విజయం సాధించిన అనంత్‌ కుమార్‌ సింగ్‌ నగదు ఆస్తులు 51 కోట్లు. ఆయనపై అత్యధికంగా 38 క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. 11 హత్యాయత్నం కేసులు, నాలుగు కిడ్నాపింగ్‌ కేసులు ఉన్నాయి. మొత్తంగా గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన వారిలో ఆస్తిపరులు, నేరస్థులు గణనీయంగా పెరిగారు. (చదవండి: బిహార్‌ ఫలితాలు-ఆసక్తికర అంశాలు)

Videos

పవన్ కళ్యాణ్ కు ముద్రగడ సవాల్

సీఎం జగన్ ను చంపేందుకు కుట్ర..!

శ్రీశైలం టీడీపీ అభ్యర్థి బండ బూతులు..

గుండె నిండా కేసీఆర్..

అట్టర్ ఫ్లాప్..

జనసేన పరువు తీసిన చింతమనేని

పవన్ కళ్యాణ్, చిరంజీవి కుట్ర బయటపెట్టిన కేఏ పాల్

వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారం

YSRCP ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడిపై దాడికి యత్నం

పులివెందులలో జోరుగా వైఎస్ భారతి ప్రచారం

సుజనా చౌదరికి కేశినేని శ్వేత కౌంటర్..

జగన్ ది ప్రోగ్రెస్ రిపోర్టు..బాబుది బోగస్ రిపోర్టు

కూటమి బండారం మేనిఫెస్టో తో బట్టబయలు

బాబు, పవన్ తో నో యూజ్ బీజేపీ క్లారిటీ..

పచ్చ బ్యాచ్ బరితెగింపు...YSRCP ప్రచార రథంపై దాడి

నేడు మూడు చోట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రచార సభలు

జగనే మళ్లీ సీఎం.. అరుకులో ప్రస్తుత పరిస్థితి...అభివృద్ధి

ఏపీలో కూటమి మేనిఫెస్టో తో తమకు సంబంధం లేదన్న బీజేపీ

స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!

టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

Photos

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)