కాంగ్రెస్‌ నేత చిదంబరానికి గాయాలు

Published on Mon, 06/13/2022 - 21:02

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత పీ చిదంబరం(76) గాయపడ్డారు. సోమవారం రాహుల్‌ గాంధీ ఈడీ విచారణ సందర్భంగా.. ఢిల్లీలో జరిగిన పార్టీ నిరసనల్లో ఆయనకు గాయాలైనట్లు తెలుస్తోంది. 

కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నేత పి.చిదంబరంను పోలీసులు తోసివేయడంతో ఆయన ఎడమ పక్కటెముకలో ఫ్రాక్చర్ అయ్యాయి. దీంతో ఆయన్ని ఆస్పత్రికి తరలించినట్లు పార్టీ శ్రేణులు వెల్లడించాయి. 

ఇదిలా ఉంటే.. మోదీ ప్రభుత్వం అనాగరికత ప్రతిపరిమితిని దాటిందని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలా ఓ ట్వీట్‌ చేశారు. మాజీ హోం మంత్రి పి చిదంబరాన్ని పోలీసులు కొట్టారు. ఆయన అద్దాలు నేలపై విసిరారు. ఎడమ పక్కటెముకలో హెయిర్‌లైన్‌ ఫ్రాక్చర్‌ అయ్యింది. ఎంపీ ప్రమోద్ తివారీని రోడ్డుపై పడేశారు. ఆయన తలకు గాయం కావడంతో పాటు పక్కటెముక ఫ్రాక్చర్ అయ్యింది. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే.. అంటూ సూర్జేవాలా ట్వీట్‌ చేశారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ