amp pages | Sakshi

కరోనా : సెప్టెంబరు చివరి నాటికి 65 లక్షల కేసులు

Published on Sat, 09/05/2020 - 14:51

సాక్షి, న్యూఢిల్లీ:  దేశంలో కరోనావైరస్ కేసుల ఉధృతి పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.. కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.  లాక్‌డౌన్ వ్యూహం నుంచి  ప్రయోజనాన్ని పొందలేని ప్రపంచంలో ఏకైక దేశం భారతదేశమేనని వ్యాఖ్యానించారు.  లాక్‌డౌన్ ద్వారా అన్ని దేశాలు కరోనా మహమ్మారిని అదుపు చేస్తే భారత్‌లో మాత్రం కరోనా విజృంభిస్తోందన్నారు. ఈమేరకు శనివారం ఆయన వరుస ట్వీట్లలో  నరేంద్ర మోదీ ప్రభుత్వంపై దాడి చేశారు.

సెప్టెంబర్ 30 నాటికి మొత్తం సంఖ్య 55 లక్షలకు చేరుకుంటుందని మొదట ఊహించాను... కానీ ఈ విషయంలో తనది  తప్పు అంచనా  అని పేర్కొన్నారు, సెప్టెంబర్ 20 నాటికి భారతదేశం ఆ సంఖ్యకు(55 లక్షలు) చేరుకోనుందని వ్యాఖ్యానించారు.  అంతేకాదు సెప్టెంబర్ చివరి నాటికి కేసులసంఖ్య 65 లక్షలకు చేరవచ‍్చని  అంచనావేశారు.  ప్రధానమంత్రి నరేంద్రమోదీ 21 రోజుల్లో కరోనా వైరస్‌ను అంత చేస్తామంటూ మొదట్లో హామీలు గుప్పించారని, కానీ ఐదు నెలలు గడిచినా కరోనాను ఎందుకు కట్టడి చేయలేకపోయారో ప్రధాని వివరణ ఇవ్వాలని  ఆయన డిమాండ్ చేశారు. ఇతర దేశాలు విజయవంతం అయినప్పుడు భారతదేశం ఎందుకు విఫలమైందో వివరించాలన్నారు.  వి షేప్‌ రికవరీ అంటూ ప్రజలను తప్పు దారి పట్టింస్తోందని మండిపడ్డారు  అలాగే  2020-21 ఆర్థిక సంవత్సరంలో ఆర్థికమందగమనం, ప్రతికూల వృద్ధిపై ఆర్థికమంత్రిత్వ శాఖ వద్ద సమాధానం లేదని మరో ట్వీట్‌లో మాజీ ఆర్థిక మంత్రి  చిదంబరం  ఆరోపించారు.

కాగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 40,23,179కి చేరింది. అందులో 8,46,395 యాక్టివ్ కేసులు ఉండగా, 31,07,223 మంది ఇప్పటికే వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.  మరణాలు 69,561గా ఉ న్నాయి.

Videos

నేడు సీఎం జగన్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇదే

మా మద్దతు సీఎం జగన్ కే

పవన్ కళ్యాణ్ కు పోతిన మహేష్ బహిరంగ లేఖ

కొల్లు రవీంద్రకు పేర్నినాని సవాల్

భారీగా పట్టుబడ్డ టీడీపీ, జనసేన డబ్బు..!

YSRCPని గెలిపించండి అని సభ సాక్షిగా చంద్రబాబు

గాంధీల కంచుకోటలో టికెట్ ఎవరికి ?

ఏపీ రాజకీయాలపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య

చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న

జగన్ గారు నాకిచ్చిన బాధ్యత "కుప్పం" కుంభస్థలం బద్దలే బాబు

షర్మిల ప్రచారం అట్టర్ ఫ్లాప్..!

పవన్ కళ్యాణ్ లేదు తొక్క లేదు.. జగనన్న కోసం ప్రాణం ఇస్తా ... తగ్గేదేలే

గన్నవరంలో జోరుగా వల్లభనేని ఎన్నికల ప్రచారం

త్వరలో తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ: దేవులపల్లి అమర్

పవన్ కు పోతిన మహేష్ లేక "ప్రశ్నలు - పంచులు "

అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!

ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి

4 కంటైనర్ లలో డబ్బు రవాణా 2 వేల కోట్లు పట్టుకున్న ఏపీ పోలీసులు

చంద్రబాబు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధురాలు..!

Photos

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)