‘హామీలన్నీ అమలు చేస్తుంటే మీకెందుకు కడుపుమంట’

Published on Sun, 09/11/2022 - 18:00

తాడేపల్లి: సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తుంటే ఎల్లో మీడియాకు కడుపుమంట ఎందుకని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. చంద్రబాబులా సీఎం జగన్‌ ప్రజలను మోసం చేయలేదని, ఇచ్చిన హామీల్లో 98 శాతానికి పైగా అమలు చేశారని బొత్స తెలిపారు. చంద్రబాబు హయాంలో ఎంత దోపిడీ జరిగిందో తెలియదా అని నిలదీశారు.  

తమ ప్రభుత్వం ఏ పథకం ప్రారంభించినా టీడీపీ నేతలు విషం చిమ్ముతున్నారన్నారు. తప్పుడు ప్రచారం అనేది ఎల్లో మీడియాకు అలవాటుగా మారిపోయిందని, దీనిలో భాగంగానే కల్యాణమస్తుపై దుష్ప్రచారం మొదలుపెట్టారన్నారు. ఉన్నవి, లేనివి రాస్తూ గందరగోళం సృష్టిస్తున్నారన్నారు. అసలు తప్పుడు ప్రచారాలతో ఏం చెప్పాలనుకుంటున్నారని, దీనికి రామోజీరావు, రాధాకృష్టలు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. అందరూ చదువుకోవాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా బొత్స తెలిపారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ