అన్ని పదవుల్లో బీసీలకు ప్రాధాన్యత: మంత్రి నాగార్జున

Published on Thu, 10/27/2022 - 15:34

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని వర్గాలకు పెద్దపీట వేశారని సాంఘిక, సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. చరిత్ర పుటల్లో నిలిచిపోయేలా వైఎస్‌ జగన్‌ పాలన సాగుతోందన్నారు. ఈ మేరకు సచివాలయంలో మంత్రి మాట్లాడుతూ.. అన్ని పదవుల్లో బీజీలకు ప్రాధానం ఇచ్చారన్నారు. పేద పిల్లల కోసం ఇంగ్లీష్‌ మీడియం తీసుకొచ్చిన ఘనత జగన్‌దేనన్నారు. నాడు-నేడు కింద స్కూళ్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు.

చదువుకునే పిల్లలకు అమ్మ ఒడి, 31 లక్షల మందికి మహిళల పేరు మీద ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినట్లు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అగ్రతాంబూలం ఇచ్చిన ప్రబుత్వం తమదేనని మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వం బీసీలను ఏనాడు పట్టించుకోలేదని విమర్శించారు. ఏ రోజైనా చంద్రబాబు పేదల గురించి ఆలోచించారా అని ప్రశ్నించారు. కనీసం కార్పొరేటర్‌గా కూడా గెలవని లోకేష్‌ సీఎ జనగ్‌ను విమర్శిచడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
చదవండి: ‘పాదయాత్ర రద్దుపై విచారణ.. అవసరమైతే పిటిషన్‌లో ఇంప్లీడ్‌ అవుతాం’

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ