కేసీఆర్‌ ఇచ్చిన చెక్కులు చెల్లుతాయా?

Published on Wed, 05/25/2022 - 01:35

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: రాష్ట్రంలోని రైతులను ఏనాడూ పట్టించుకోని సీఎం కేసీఆర్‌ పంజాబ్‌ రైతు లకు చెక్కులి చ్చారని, అవిప్పుడు చెల్లుబాటు అవుతాయా? అని అక్కడి రైతులు సందేహం వెలిబుచ్చుతున్నా రని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. రాష్ట్రం ఆర్థికంగా తీవ్ర గడ్డు పరిస్థితు లు ఎదుర్కొంటోందని, ధాన్యం కొనుగోళ్లలో జాప్యం నెలకొందని, ఉద్యోగులకు జీతాలు, పింఛన్లకు సైతం డబ్బులు లేవని ఎద్దేవా చేశారు.

హనుమాన్‌ జయంతి శోభాయాత్రను పురస్కరించుకుని మంగళవారం కరీంనగర్‌లో  ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 26న మోదీ రాష్ట్రానికి వస్తున్నందునే కేసీఆర్‌ దేశయాత్రల కు శ్రీకారం చుట్టారని విమర్శించారు. పార్ల మెంటు సభ్యుడిగా మూడేళ్లకాలంలో తన ని యోజక వర్గానికి ఎంతో చేశానని, ఈ సమ యంలో రాజకీయాలు వద్దని, అభివృద్ధి కోసం అంతా కలిసికట్టుగా సాగుదామని టీఆర్‌ఎస్‌కు హితవు పలికారు.  కేంద్రం పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గించిన నేపథ్యంలో రాష్ట్రం కూడా తగ్గించాలని డిమాండ్‌ చేశారు.  

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ