జేఈఈ మెయిన్స్లో సత్తాచాటిన గిరిజన బాలికలు
‘లోకేష్పై సుమోటోగా కేసు నమోదు చేయాలి’
Published on Tue, 10/27/2020 - 18:42
సాక్షి, అమరావతి : నారా లోకేష్ వ్యాఖ్యలపై న్యాయస్థానాలే సుమోటోగా కేసు నమోదు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్నేత సీ రామచంద్రయ్య తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విటర్లో స్పందించారు. తణుకులో లోకేష్ చేసిన వ్యాఖ్యలు న్యాయస్థానాలు, న్యాయమూర్తులను కించపరచడమే అవుతుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లు న్యాయస్థానాలు నడుస్తున్నాయని మాట్లాడటం లోకేష్ అహంకారానికి, అజ్ఞానానికి నిదర్శనమని సీ రామచంద్రయ్య అన్నారు. కాగా తన కేసుల మాఫీ కోసమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోలవరం ప్రాజెక్టును తాకట్టు పెట్టారని తణుకులో లోకేష్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారుచదవండి: ‘వరి చేనుకు చేపల చెరువుకు తేడా తెలియని మేధావి’
కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లు న్యాయ స్థానాలు నడుస్తున్నాయనట్లు మాట్లాడటం ఆయన అహంకారానికి, అజ్ఞానానికి నిదర్శనం. లోకేష్ వ్యాఖ్యలపై న్యాయస్థానాలే 'సుమోటో' గా కేసు నమోదు చేయాలి.
— C RAMACHANDRAIAH (@crama39111) October 27, 2020
Tags