IPL2022: విజయానందంలో పంత్‌ సేన.. అంతలోనే సాడ్‌ న్యూస్‌

Published on Mon, 03/28/2022 - 15:48

Mitchell Marsh Likely To Miss IPL 2022: ముంబై ఇండియన్స్‌పై సూపర్‌ విక్టరీ సాధించి సంబురాల్లో మునిగితేలుతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఓ సాడ్‌ న్యూస్‌ తెలిసింది. ప్రస్తుతం పాక్‌ పర్యటనలో ఉన్న ఆ జట్టు కీలక ఆటగాడు, స్టార్‌ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్‌కు గాయమైనట్లు ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల సారధి ఆరోన్‌ ఫించ్‌ వెల్లడించాడు. ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా మార్ష్‌కు తొడ కండరాలు పట్టేసాయని ఫించ్‌ పేర్కొన్నాడు. దీంతో మార్ష్‌ పాక్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్ మొత్తానికి దూరం కానున్నాడని ఫించ్‌ తెలిపాడు. 

ఒకవేళ మార్ష్‌కు తగిలిన గాయం పెద్దదైతే అతను ఐపీఎల్ 2022 ఆడేది కూడా అనుమానమేనని తెలుస్తోంది. ఈ వార్త తెలిసి ఢిల్లీ క్యాపిటల్స్‌ ఉలిక్కిపడింది. ఇటీవలే ముగిసిన వేలంలో మార్ష్‌ను డీసీ 6.5 కోట్లు వెచ్చించి దక్కించుకుంది. ఇప్పటికే కీలక బౌలర్, సౌతాఫ్రికా ఆటగాడు ఆన్రిచ్ నోర్జే సేవలను కోల్పోయిన డీసీకి.. ఆల్‌రౌండర్ మార్ష్ కూడా దూరమైతే ఆ జట్టు విజయావకాశాలపై తీవ్ర ప్రభావం తప్పదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే, పంత్‌ సేన తమ తదుపరి మ్యాచ్‌లో (ఏప్రిల్‌ 2న) గుజరాత్‌ టైటాన్స్‌తో తలపడాల్సి ఉంది. 
చదవండి: పంజాబ్‌ విజయంపై 'ఆ సినిమా' ప్రభావం.. అదే స్పూర్తితో..!

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ