పాకిస్థాన్‌ మొదలు పెడితే మరో రెండు దేశాలు అదే పాట పాడుతున్నాయి..!

Published on Sat, 04/09/2022 - 20:28

భారత్‌, పాక్‌ సహా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ దేశాలను కలుపుకుని నాలుగు దేశాల టీ20 సిరీస్ నిర్వహించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) గత కొన్ని రోజులుగా ఐసీసీని విన్నవించుకుంటున్న విషయం తెలిసిందే. ఈ విషయమై చర్చించేందుకు ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్ కమిటీ (సీఈసీ) నిన్న (ఏప్రిల్‌ 8) దుబాయ్‌లో సమావేశమైంది. క్వాడ్రాంగ్యులర్ టీ20 సిరీస్‌ల విషయంలో పాక్‌ మొదలు పెట్టిన పాటను, ఈ సమావేశం వేదికగా మరో రెండు దేశాల బోర్డులు అందుకున్నాయి. పాక్‌ ప్రతిపాదించిన తరహాలోనే టీ20 సిరీస్‌లు నిర్వహించాలని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ), క్రికెట్ వెస్టిండీస్ (సీడబ్ల్యూఐ) ఐసీసీకి విజ్ఞప్తి చేశాయి. ఇందుకు సంబంధించిన ప్రణాళికలను సైతం ఆయా దేశాలు ఐసీసీ ముందుంచాయి. 

పీసీబీ ప్రతిపాదించిన టోర్నీ విషయమై చర్చిద్దామని  సమావేశం ఏర్పాటు చేస్తే తాజాగా మరో రెండు దేశాల బోర్డులు అదే తరహా ప్రతిపాదనతో ముందుకు రావడంతో ఐసీసీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే, పీసీబీ చీఫ్‌ రమీజ్‌ రాజా ఆదివారం సాయంత్రం క్వాడ్రాంగ్యులర్ సిరీస్‌కు సంబంధించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌ను ఐసీసీ ముందుంచనున్నాడు. తమ ప్రతిపాదనతో ఆయా దేశాల క్రికెట్‌ బోర్డులకు భారీ ఆదాయం సమకూరడంతో పాటు ప్రేక్షకులకు సైతం అమితమైన వినోదం ఉంటుందని పీసీబీ ఐసీసీని కన్విన్స్‌ చేయనుందని సమాచారం. తటస్థ వేదికలపై ఈ సిరీస్‌ నిర్వహణకు అవకాశమివ్వాలని పీసీబీ ఐసీసీని కోరనున్నట్లు తెలుస్తోంది. 
చదవండి: భర్త ఐపీఎల్‌లో ఇరగదీస్తుంటే.. భార్య భారత్‌కు బంగారు పతకం సాధించి పెట్టింది..!

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ