ఇంగ్లండ్‌దే సిరీస్‌ 

Published on Sun, 09/27/2020 - 03:22

డెర్బీ: ఆరు నెలల తర్వాత పునః ప్రారంభమైన మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి సిరీస్‌ను ఇంగ్లండ్‌ జట్టు గెలుచుకుంది. వెస్టిండీస్‌ జట్టుతో జరుగుతోన్న 5 మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ఇంగ్లండ్‌ 3–0తో కైవసం చేసుకుంది. ఈ రెండు జట్ల మధ్య శనివారం జరిగిన మూడో టి20 మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌ 20 పరుగుల తేడాతో నెగ్గింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ నటాలీ స్కీవర్‌ (61 బంతుల్లో 82; 9 ఫోర్లు, 1 సిక్స్‌) అద్భుత ఇన్నింగ్స్‌తో చెలరేగింది. హీథెర్‌నైట్‌ (29; 3 ఫోర్లు) రాణించింది. అనంతరం వెస్టిండీస్‌ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లకు 134 పరుగులే చేసి ఓడిపోయింది. డాటిన్‌ (56 బంతుల్లో 63; 9 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధసెంచరీ సాధించింది. హీలీ మాథ్యూస్‌ (23 బంతుల్లో 21; 2 ఫోర్లు), స్టెఫానీ టేలర్‌ (13 బంతుల్లో 14 నాటౌట్‌; 2 ఫోర్లు), షినెల్లీ హెన్రీ (12 బంతుల్లో 12 నాటౌట్‌; 1 సిక్స్‌) ఫర్వాలేదనిపించారు. కేథరిన్‌ బ్రంట్, సారా గ్లెన్‌ చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు.  

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ